Movie News

జూలై 11 నుండి సెట్స్ పైకి పవన్!

‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అలానే మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ కొంతవరకు జరగ్గా.. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు కొంచెం మెరుగు పడుతుండటంతో షూటింగ్‌లు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ కూడా తన సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్ ను నిర్మించారు. ఈ సెట్ లో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జూలై 11 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అదే రోజు నుండి పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనున్నారు. పవన్ తో పాటు రానా కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నిత్యామీనన్ కనిపించనుంది. సినిమాలో ఆమె కనిపించేది తక్కువ సేపే అయినప్పటికీ ఇంపాక్ట్ చూపించే విధంగా ఉంటుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి అందిస్తోన్న మాటలు, స్క్రీన్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయం. సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

This post was last modified on June 19, 2021 4:16 pm

Share
Show comments

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

3 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

4 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

5 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

5 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

6 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

6 hours ago