నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా జన్మదిన వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా..? రారా..? అనే విషయంలో తనకు బాధ లేదంటూనే అతడి రాకతో పార్టీకి నష్టం కలిగితే ఏం చేస్తారంటూ ప్రశ్నించారు బాలయ్య.
ఆ తరువాత తనలో ఉన్న భాష, సాహిత్యం, జ్ఞానం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ అంటే ఒక మీడియా.. ఓన్లీ బాలకృష్ణ.. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అంటూ వివరించారు. భాషను బతికించాలంటే అది తన వల్లే అవుతుందని.. తనతోనే అంతరించుకుపోతుందని.. ఇది మాత్రం గ్యారంటీ అని.. ఛాలెంజ్ చేశారు. ఆర్టిస్ట్ అంటే నవ్వడమో.. ఏడవడమో కాదని.. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం, ఆత్మలోకి వెళ్లడం, దాని తాలూకా అనుభూతుల్లోకి వెళ్లడమని చెప్పారు.
పాత్రలో ఉన్నప్పుడు అప్పుడప్పుడూ తనను తాను గిచ్చుకుంటూ ఉంటానని.. ఎందుకంటే ”ఒరేయ్ నువ్ ఆ పాత్రవి కావు.. బాలకృష్ణవి అని తెలియడం కోసం” అని అన్నారు. మరో రెండు తరాల వరకు భాషను బతికించుకోగలుగుతానని చెప్పుకొచ్చారు. బాలయ్యకు తెలుగు భాషపై ఉన్న పట్టు గురించి తెలిసిందే. సందర్భం వచ్చిన ప్రతీసారి ఆయన తన టాలెంట్ ను బయటపెడుతూనే ఉంటారు. గతంలో శివశంకర పాట పాడిన బాలయ్య ఇటీవల శ్రీరామ దండకం వినిపించారు.
టాలీవుడ్లో చాలామంది వారసులు సక్సెస్ ఫుల్ హీరోలుగా నిలదొక్కుకున్నారు. వారిలో కొందరికి ఆరంభం నుంచే కలిసొచ్చింది. కొందరు కాస్త తడబడి…
నేచురల్ స్టార్ నాని కెరీర్ ఆరంభంలో పెద్ద హిట్ అయిన చిత్రాల్లో ‘పిల్ల జమీందార్’ ఒకటి. ఈ చిత్రంతోనే అశోక్ బాబు…
సినీ ఇండస్ట్రీలో స్టార్స్ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా సరే.. ఒకరి ప్రొఫెషన్ ను మరొకరు గౌరవించుకోవడం ఎప్పుడూ పాజిటివ్…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఏముందన్న…
రాజకీయ నేతలు...ప్రత్యేకించి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతరత్రా ప్రముఖులపై తనదైన శైలి దూషణ భాషతో పేట్రేగిపోయిన జోసెఫ్…
డైరెక్టర్ కావాలన్న ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్లకు ఏళ్ళు కష్టపడి కొంత అనుభవం సంపాదించాక.. కథలు తయారు చేసుకుని హీరోలు,…