పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ప్రస్తుతం క్రిష్ రూపొందిస్తోన్న ‘హరిహర వీరమల్లు’, అలానే ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండడం.. రానా లాంటి హీరోతో పవన్ తలపడడం వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో దర్శకుడు వి.వి.వినాయక్ క్యామియో రోల్ పోషించినట్లు సమాచారం. ఇటీవలే ఆయన సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందట. నిజానికి మలయాళంలో వెర్షన్ లో ఈ సన్నివేశాల్లో ఒరిజినల్ డైరెక్టర్ సాచీ కనిపించారు. అదే రోల్ ను తెలుగులో వినాయక్ తో చేయించారు. రానా, వినాయక్ ల మధ్య కాంబినేషన్ సీన్ ఉంటుందని తెలుస్తోంది. పోలీసులతో గొడవ పడొద్దంటూ రానాకి సలహా ఇచ్చే పాత్రలో వినాయక్ కనిపించనున్నారు.
వినాయక్ క్యామియో రోల్ పోషించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాల్లో ఒక్కో సీన్ లో తళుక్కున మెరిశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపించే ఛాన్స్ రావడంతో ఆయన వెంటనే ఓకే చెప్పి.. తన సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషిస్తుండగా.. రానా ఆర్మీ రిటైర్ట్ హవల్దార్గా కనిపించనున్నారు. సినిమాలో వీరిద్దరి మధ్య సన్నివేశాలు హోరాహోరీగా ఉండబోతున్నాయని అంటున్నారు.
This post was last modified on June 9, 2021 2:51 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…