పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ప్రస్తుతం క్రిష్ రూపొందిస్తోన్న ‘హరిహర వీరమల్లు’, అలానే ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండడం.. రానా లాంటి హీరోతో పవన్ తలపడడం వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో దర్శకుడు వి.వి.వినాయక్ క్యామియో రోల్ పోషించినట్లు సమాచారం. ఇటీవలే ఆయన సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందట. నిజానికి మలయాళంలో వెర్షన్ లో ఈ సన్నివేశాల్లో ఒరిజినల్ డైరెక్టర్ సాచీ కనిపించారు. అదే రోల్ ను తెలుగులో వినాయక్ తో చేయించారు. రానా, వినాయక్ ల మధ్య కాంబినేషన్ సీన్ ఉంటుందని తెలుస్తోంది. పోలీసులతో గొడవ పడొద్దంటూ రానాకి సలహా ఇచ్చే పాత్రలో వినాయక్ కనిపించనున్నారు.
వినాయక్ క్యామియో రోల్ పోషించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాల్లో ఒక్కో సీన్ లో తళుక్కున మెరిశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపించే ఛాన్స్ రావడంతో ఆయన వెంటనే ఓకే చెప్పి.. తన సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషిస్తుండగా.. రానా ఆర్మీ రిటైర్ట్ హవల్దార్గా కనిపించనున్నారు. సినిమాలో వీరిద్దరి మధ్య సన్నివేశాలు హోరాహోరీగా ఉండబోతున్నాయని అంటున్నారు.
This post was last modified on June 9, 2021 2:51 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…