పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత బండ్ల గణేష్ కు ఉన్న బంధం గురించి తెలిసిందే. పవన్ ని దేవుడిలా కొలుస్తుంటారు బండ్ల గణేష్. ఎప్పటికప్పుడు పవన్ పై తనకున్న అభిమానాన్ని చాటేలా పోస్ట్ లు చేస్తుంటారు. పవన్ కి సంబంధించిన ప్రతీ ఈవెంట్ లో బండ్ల గణేష్ ఉండాల్సిందే. ‘వకీల్ సాబ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ ను ఉద్దేశిస్తూ.. బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ను అభిమానులు అంత సులువుగా మర్చిపోలేరు. పవన్ రీ ఎంట్రీలో వరుస సినిమాలు అంగీకరిస్తుండడంతో బండ్ల గణేష్ కూడా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పవన్ తనయుడు అకీరా నందన్ ను బండ్ల గణేష్ లాంచ్ చేస్తారా..? అనే విషయం ఇప్పుడు ట్విట్టర్ లో చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ఏంటంటే.. ఈరోజు పవన్ కళ్యాణ్, అకీరా కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రిని మించిపోయిన అకీరా హైట్ ను చూసుకుంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. పలు కామెంట్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఈ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్.. ”నా దేవుడుతో నా హీరో” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తన దేవుడైతే.. అకీరాను తన హీరోగా అంటూ పరోక్షంగా చెప్పారు బండ్ల గణేష్. ఈ పోస్ట్ చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరాను లాంచ్ చేస్తున్నారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే అకీరాకు ప్రస్తుతం సినిమాల మీద పెద్దగా ఆసక్తి లేదని.. మ్యూజిక్, కవితలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడని గతంలో రేణుదేశాయ్ వెల్లడించారు. ఒకవేళ తన కొడుకు హీరో అవుతానంటే కచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు.
This post was last modified on June 1, 2021 8:54 am
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…