తమిళ, తెలుగు పరిశ్రమల్లో మంచి పేరున్న గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద.. తమిళ లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తు మీద మూడేళ్ల కిందట చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎంతగా సంచలనం రేపాయో తెలిసిందే. వైరముత్తు మీద ఆమె అప్పట్నుంచి అలుపులేని పోరాటం చేసింది. వైరముత్తుపై ఆమె కేసులు కూడా పెట్టగా.. ఇప్పటిదాకా అయితే ఆయనపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.
బహుశా ఎన్నో ఏళ్ల కిందట జరిగిన విషయాలకు సంబంధించి ఇప్పుడు చిన్మయి ఆధారాలు ఇవ్వలేకపోవడం వల్ల ఈ కేసులు నిలవలేకపోయి ఉండొచ్చు. ఐతే వైరముత్తు ప్రతిష్ఠను దెబ్బ తీయడంలో మాత్రం చిన్మయి విజయవంతం అయిందనే చెప్పాలి. తాజాగా కేరళకు చెందిన ఓఎన్వీ అకాడమీ వైరముత్తుకు సాహిత్య పురస్కారం ప్రకటించడంపై ఎంత వివాదం నడుస్తోందో తెలిసిందే. చివరికి తనకీ అవార్డు వద్దంటూ వైరముత్తు వెనక్కిచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ వివాదం ఇలా ఉంటే.. మరో వైరముత్తు-చిన్మయిలకు సంబంధించి గొడవ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. వైరముత్తుపై ఇన్ని ఆరోపణలు చేసిన చిన్మయి.. తన పెళ్లికి ఆయన్ని స్వయంగా ఆహ్వానించడమే కాక.. ఆయన వచ్చినపుడు ఆశీర్వాదాలు తీసుకోవడం ఏంటనే ప్రశ్న ఆమెకు గతంలో ఎదురైంది. ఐతే తాను ఆయన్ని పెళ్లికి పిలవాలనుకోలేదని.. వైరముత్తు కొడుకు, లిరిసిస్ట్ మదన్ కార్కీనే ఆయన్ని పిలవాలని కోరడంతో ఆహ్వానించాల్సి వచ్చిందని చిన్మయి వెల్లడించింది.
దీనిపై మదన్ తాజాగా స్పందించాడు. చిన్మయి అబద్ధాల కోరని.. పెళ్లికి పిలిచేందుకు తన తండ్రి అపాయింట్మెంట్ అడిగితే ఇప్పించానని, తానేమీ తన తండ్రిని చిన్మయి పెళ్లికి పిలవాలని కోరుకోలేదని అన్నాడు. తన తండ్రిపై చిన్మయి చేస్తున్న ఆరోపణలను తాను నమ్మట్లేదని అతను స్పష్టం చేశాడు. దీనిపై చిన్మయి ఘాటుగా స్పందించింది. తాను వైరముత్తు వేధింపుల గురించి మదన్కు చెబితే.. ఆయన అలాంటివాడే అని తమ కుటుంబానికి తెలుసని.. ఈ విషయంలో తనకే మద్దతు ఇస్తున్నట్లు కూడా మదన్ అప్పట్లో చెప్పాడని.. కానీ ఇప్పుడు మాట మార్చేస్తున్నాడని.. అతణ్ని నమ్మడం తన పొరబాటని చిన్మయి పేర్కొంది.
This post was last modified on May 30, 2021 5:15 pm
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…