భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్-2. ఇండియన్ వెబ్ సిరీస్ల చరిత్రలోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అనడంలో మరో మాట లేదు. రెండేళ్ల కిందటే అమేజాన్ ప్రైమ్లో రిలీజైన ఈ సిరీస్కు గొప్ప ఆదరణ లభించింది. గత రెండేళ్లలో భారీ సంఖ్యలో ప్రేక్షకులు ఈ సిరీస్ను వీక్షించారు. అది చూసినప్పటి నుంచి సెకండ్ సీజన్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఏడాది కిందటే రావాల్సిన ఫ్యామిలీ మ్యాన్-2 కొవిడ్ కారణంగా ఆలస్యమైంది. ఈ ఏడాది ఆరంభంలో రెండో సీజన్ను విడుదలకు సిద్ధం చేయగా.. అప్పుడు తాండవ్ సహా కొన్ని సిరీస్ల విషయంలో వివాదాలు తలెత్తడంతో అమేజాన్ ఈ సిరీస్ను వాయిదా వేసింది. కొంచెం గ్యాప్ ఇచ్చి జూన్ 4న ఫ్యామిలీ మ్యాన్-2ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసింది. ఇటీవలే ట్రైలర్ కూడా లాంచ్ చేసింది.
ఫ్యామిలీ మ్యాన్-2 ట్రైలర్ మెజారిటీ ప్రేక్షకులకు నచ్చింది కానీ..అందులో సమంత పాత్ర విషయంలో తమిళులకు మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎల్టీటీఈ బ్యాక్ డ్రాప్లో సినిమా తీసినా, వెబ్ సిరీస్ తీసినా తమిళులకు నచ్చదు. తమిళ టైగర్లను నెగెటివ్ రోల్లో చూపిస్తే వాళ్లు ఒప్పుకోరు. ఫ్యామిలీ మ్యాన్-2 విషయంలోనూ వీరి అభ్యంతరాలు ఇవే. ట్రైలర్ లాంచ్ అయినపుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తమిళులు విమర్శనాస్త్రాలు గుప్పించారు. కరోనా టైం కాబట్టి ఊరుకున్నారు కానీ.. లేదంటే బయట ఆందోళనలు కూడా జరిగేవేమో. ఐతే అలాగని ఈ సిరీస్ను అంత తేలిగ్గా వదిలేలా లేరు. వైగో అనే ఎంపీ ఫ్యామిలీ మ్యాన్-2 విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఈ సిరీస్ను ఆపాలంటూ కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్కు లేఖ రాశారు. సమంత పాత్ర తమిళుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని ఆయన ఆక్షేపించారు. ఇలా రాజకీయ నాయకుల జోక్యం మొదలవడంతో జూన్ 4న ఫ్యామిలీ మ్యాన్-2 సీజన్-2 అనుకున్న ప్రకారం విడుదలవుతుందో లేదో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on May 23, 2021 7:19 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…