Movie News

అమూల్యకు కంపెనీ ఇవ్వడానికి బంటూ..

టాలీవుడ్లో మరో సెలబ్రెటీ కరోనా బారిన పడ్డారు. తాను కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా వెల్లడించాడు. ఐతే తనకు కరోనా లక్షణాలు మరీ ఎక్కువేమీ లేవని, తాను క్షేమంగానే ఉన్నానని.. అభిమానులు ఎవరూ కంగారు పడొద్దని బన్నీ కోరాడు. అల్లు కథానాయకుడికి కరోనా అని తెలియగానే సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తాయి. #Getwellsoonalluarjun అని హ్యాష్ ట్యాగ్ పెట్టి నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సెలబ్రెటీల్లోనూ చాలామంది బన్నీ త్వరగా కోలుకోవాలంటూ మెసేజ్‌లు పెట్టారు.

ఐతే బన్నీ చివరి సినిమా ‘అల వైకుంఠపురములో’ కోస్టార్ పూజా హెగ్డే మాత్రం ఈ న్యూస్ పట్ల కొంచెం సరదాగా స్పందించింది. పూజా ఇప్పటికే కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు పొడి దగ్గు ఉన్నట్లు, అలాగే వాసన కోల్పోియినట్లు కూడా వెల్లడైంది. అయినప్పటికీ పూజా ఏమీ స్థైర్యం కోల్పోలేదు. అలాగే తన సెన్సాఫ్ హ్యూమర్‌నూ విడిచిపెట్టలేదు.

అమూల్య (అల వైకుంఠపురుములో పూజా క్యారెక్టర్ పేరు)కు కంపెనీ ఇవ్వడానికి బంటూ (అల..లో బన్నీ పేరు) వచ్చాడని ఆమె ట్వీట్ వేసింది. సరదాకు ఆ మాట అంటూనే బన్నీ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించింది. స్వయంగా పూజా సైతం కరోనా పేషెంటే కావడంతో ఈ టైంలో ఈ జోకులేంటి అని ఆమెను అల్లు అర్జున్ అభిమానులేమీ టార్గెట్ చేయట్లేదు. బన్నీని పూజా స్పెషల్ కోస్టార్‌గా చూస్తుంది. అతడితో చేసిన తొలి చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’తోనే ఆమె దశ తిరిగింది.

ఆ సినిమా సరిగా ఆడకున్నా పూజా మాత్రం అందరినీ ఇంప్రెస్ చేసి అవకాశాలు అందుకుంది. పెద్ద స్టార్ అయిపోయింది. బన్నీతో రెండోసారి కలిసి చేసిన ‘అల వైకుంఠపురములో’ ఏకంగా టాలీవుడ్లో నాన్ బాహుబలి హిట్ కావడంతో పూజా రేంజ్ ఇంకా పెరిగిపోయింది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఆమె భారీ చిత్రాల్లో నటిస్తోంది. పూజాతో పాటు అల్లు అర్జున్ కూడా త్వరగా కోలుకుని మామూలు మనుషులు కావాలని ఆశిద్దాం.

This post was last modified on April 28, 2021 9:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

1 hour ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

3 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

3 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

3 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

4 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

4 hours ago