Movie News

అమూల్యకు కంపెనీ ఇవ్వడానికి బంటూ..

టాలీవుడ్లో మరో సెలబ్రెటీ కరోనా బారిన పడ్డారు. తాను కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా వెల్లడించాడు. ఐతే తనకు కరోనా లక్షణాలు మరీ ఎక్కువేమీ లేవని, తాను క్షేమంగానే ఉన్నానని.. అభిమానులు ఎవరూ కంగారు పడొద్దని బన్నీ కోరాడు. అల్లు కథానాయకుడికి కరోనా అని తెలియగానే సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తాయి. #Getwellsoonalluarjun అని హ్యాష్ ట్యాగ్ పెట్టి నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సెలబ్రెటీల్లోనూ చాలామంది బన్నీ త్వరగా కోలుకోవాలంటూ మెసేజ్‌లు పెట్టారు.

ఐతే బన్నీ చివరి సినిమా ‘అల వైకుంఠపురములో’ కోస్టార్ పూజా హెగ్డే మాత్రం ఈ న్యూస్ పట్ల కొంచెం సరదాగా స్పందించింది. పూజా ఇప్పటికే కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు పొడి దగ్గు ఉన్నట్లు, అలాగే వాసన కోల్పోియినట్లు కూడా వెల్లడైంది. అయినప్పటికీ పూజా ఏమీ స్థైర్యం కోల్పోలేదు. అలాగే తన సెన్సాఫ్ హ్యూమర్‌నూ విడిచిపెట్టలేదు.

అమూల్య (అల వైకుంఠపురుములో పూజా క్యారెక్టర్ పేరు)కు కంపెనీ ఇవ్వడానికి బంటూ (అల..లో బన్నీ పేరు) వచ్చాడని ఆమె ట్వీట్ వేసింది. సరదాకు ఆ మాట అంటూనే బన్నీ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించింది. స్వయంగా పూజా సైతం కరోనా పేషెంటే కావడంతో ఈ టైంలో ఈ జోకులేంటి అని ఆమెను అల్లు అర్జున్ అభిమానులేమీ టార్గెట్ చేయట్లేదు. బన్నీని పూజా స్పెషల్ కోస్టార్‌గా చూస్తుంది. అతడితో చేసిన తొలి చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’తోనే ఆమె దశ తిరిగింది.

ఆ సినిమా సరిగా ఆడకున్నా పూజా మాత్రం అందరినీ ఇంప్రెస్ చేసి అవకాశాలు అందుకుంది. పెద్ద స్టార్ అయిపోయింది. బన్నీతో రెండోసారి కలిసి చేసిన ‘అల వైకుంఠపురములో’ ఏకంగా టాలీవుడ్లో నాన్ బాహుబలి హిట్ కావడంతో పూజా రేంజ్ ఇంకా పెరిగిపోయింది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఆమె భారీ చిత్రాల్లో నటిస్తోంది. పూజాతో పాటు అల్లు అర్జున్ కూడా త్వరగా కోలుకుని మామూలు మనుషులు కావాలని ఆశిద్దాం.

This post was last modified on April 28, 2021 9:27 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

2 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

2 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

2 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

5 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

5 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

7 hours ago