వైల్డ్ డాగ్.. వైల్డ్ డాగ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ప్రియుల చర్చల్లో ఉన్న సినిమా ఇది. మూడు రోజుల కిందటే నెట్ ఫ్లిక్స్లో ఈ సినిమాను రిలీజ్ చేయగా.. భాషతో సంబంధం లేకుండా అందరూ విరగబడి ఈ చిత్రాన్ని చూస్తున్నారు. తొలి రెండు రోజులు నెట్ ఫ్లిక్స్లో ‘వైల్డ్ డాగ్’ తెలుగు వెర్షణ్ నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అయింది. తమిళం, హిందీ వెర్షన్లకు కూడా మంచి స్పందన వచ్చింది.
ఇండియాలోనే కాదు.. యుఎస్ సహా పలు దేశాల్లో ‘వైల్డ్ డాగ్’ ట్రెండ్ అవుతుండటం విశేషం. ఈ సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. ఎలివేషన్లు ఇస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో ఎందుకు సరిగా ఆఢలేదని ఆశ్చర్యపోతున్నారు. ఏప్రిల్ 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేకపోయింది. మంచి టాక్ తెచ్చుకుని కూడా ఓపెనింగ్స్ లేవు. ఫుల్ రన్లో రూ.3 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది.
నిజానికి ‘వైల్డ్ డాగ్’ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ థియేటర్లు పున:ప్రారంభమై సినిమాలు బాగా ఆడుతుండటంతో ఆ డీల్ క్యాన్సిల్ చేసి మరీ ముందు థియేటర్లలో రిలీజ్ చేశారు. కొంచెం గ్యాప్ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా డీల్ రివైజ్ చేశారు. కానీ థియేటర్ల నుంచి ఆశించిన ఆదాయం రాలేదు. అక్కడ సినిమా డిజాస్టర్ స్టేటస్ అందుకుంది. కానీ ఇప్పుడు ఓటీటీలో సినిమాకు మంచి స్పందన వస్తోంది.
ఇది చూసి ఆ థియేట్రికల్ రిలీజ్ లేకపోయినా బాగుండేది, నాగార్జున పరువు దక్కేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పెద్ద హీరో సినిమాకు మరీ రూ.3 కోట్ల షేర్ రావడం దారుణం. అది చూసి నాగార్జునను సోషల్ మీడియాలో అందరూ ట్రోల్ చేశారు. అక్కినేని అభిమానుల పరిస్థితి ఘోరం అప్పుడు. ఇప్పుడు ఓటీటీలో వస్తున్న స్పందన చూస్తే.. నేరుగా డిజిటల్ మీడియంలోనే రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని, నాగ్కు అవమాన భారం తప్పేదని అంటున్నారు. ఒకవేళ నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ వచ్చి ఉంటే.. ఇలాంటి సినిమాను థియేటర్లలో ఎందుకు రిలీజ్ చేయలేదని జనాలు అనేవారేమో.
This post was last modified on April 26, 2021 7:31 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…