కొవిడ్ కష్టాలన్నీ దాటేశామని.. గత ఏడాది చూసిన గడ్డు పరిస్థితులు ఇంకెప్పటికీ రావని నెల కిందటి వరకు చాలా సంతోషంగా ఉన్నారు సినీ జనాలు. కానీ చూస్తుండగానే పరిస్థితులు మారిపోయాయి. షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్లు మూతపడిపోయాయి. గత ఏడాది ఇదే పరిస్థితి నెలకొనగా.. కొన్ని రోజుల్లోనే మామూలు స్థితికి వచ్చేస్తామని.. షూటింగ్స్ పున:ప్రారంభం అవుతాయని.. థియేటర్లు మళ్లీ తెరుచుకుంటాయని అనుకున్నారు. కానీ అందుకోసం నెలలకు నెలలు ఎదురు చూసి చూసి అలసిపోయారు.
ఒక దశ దాటాక థియేటర్ల మీద పూర్తిగా ఆశలు కోల్పోయి కొత్త సినిమాలను ఓటీటీ బాట పట్టించారు. కష్ట కాలంలో ఓటీటీలే ఇండస్ట్రీని ఆదుకున్నాయి. ఇళ్లకు పరిమితం అయిన జనాలు ఓటీటీలను ఆదరించడంతో.. అవి మంచి రేట్లు పెట్టి కొత్త సినిమాలను కొని నేరుగా రిలీజ్ చేశాయి. దీంతో కొంత మేర ఇండస్ట్రీ కష్టాల నుంచి గట్టెక్కింది. మళ్లీ థియేటర్లు మొదలయ్యాక నెమ్మదిగా ఓటీటీల జోరు తగ్గుతూ వచ్చింది. తెలుగులో అయితే నేరుగా ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేయడం దాదాపు ఆగిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ షూటింగ్స్ ఆగి, థియేటర్లు మూతపడ్డ పరిస్థితుల్లో ఓటీటీల వైపు చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ నెలలో రావాల్సిన క్రేజీ సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడిపోయాయి. థియేటర్ల మీద ఆంక్షలు మొదలయ్యాయి.
ఏపీలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించారు. అక్కడ టికెట్ల రేట్ల మీద నియంత్రణా కొనసాగుతుండటంతో థియేటర్లను ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పెట్టి 8 గంటలకే థియేటర్లు మూసివేయాలని చెప్పడంతో అలా ఎందుకని మొత్తంగా థియేటర్లనే మూసేస్తున్నారు. కరోనా మళ్లీ ఎప్పటికి నియంత్రణలోకి వస్తుందో.. థియేటర్లు ఒకప్పటిలా నడిచేదెప్పుడో తెలియని అయోమయం నెలకొంది. కొన్ని రోజులు ఎదురు చూశాక పరిస్థితులు మారకపోతే మళ్లీ నిర్మాతలు కొత్త చిత్రాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి పూనుకోవడం ఖాయం. ఓటీటీలు కూడా ఆ దిశగా సానుకూలంగానే స్పందించే అవకాశముంది.
This post was last modified on April 21, 2021 3:45 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…