కొవిడ్ కష్టాలన్నీ దాటేశామని.. గత ఏడాది చూసిన గడ్డు పరిస్థితులు ఇంకెప్పటికీ రావని నెల కిందటి వరకు చాలా సంతోషంగా ఉన్నారు సినీ జనాలు. కానీ చూస్తుండగానే పరిస్థితులు మారిపోయాయి. షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్లు మూతపడిపోయాయి. గత ఏడాది ఇదే పరిస్థితి నెలకొనగా.. కొన్ని రోజుల్లోనే మామూలు స్థితికి వచ్చేస్తామని.. షూటింగ్స్ పున:ప్రారంభం అవుతాయని.. థియేటర్లు మళ్లీ తెరుచుకుంటాయని అనుకున్నారు. కానీ అందుకోసం నెలలకు నెలలు ఎదురు చూసి చూసి అలసిపోయారు.
ఒక దశ దాటాక థియేటర్ల మీద పూర్తిగా ఆశలు కోల్పోయి కొత్త సినిమాలను ఓటీటీ బాట పట్టించారు. కష్ట కాలంలో ఓటీటీలే ఇండస్ట్రీని ఆదుకున్నాయి. ఇళ్లకు పరిమితం అయిన జనాలు ఓటీటీలను ఆదరించడంతో.. అవి మంచి రేట్లు పెట్టి కొత్త సినిమాలను కొని నేరుగా రిలీజ్ చేశాయి. దీంతో కొంత మేర ఇండస్ట్రీ కష్టాల నుంచి గట్టెక్కింది. మళ్లీ థియేటర్లు మొదలయ్యాక నెమ్మదిగా ఓటీటీల జోరు తగ్గుతూ వచ్చింది. తెలుగులో అయితే నేరుగా ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేయడం దాదాపు ఆగిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ షూటింగ్స్ ఆగి, థియేటర్లు మూతపడ్డ పరిస్థితుల్లో ఓటీటీల వైపు చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ నెలలో రావాల్సిన క్రేజీ సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడిపోయాయి. థియేటర్ల మీద ఆంక్షలు మొదలయ్యాయి.
ఏపీలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించారు. అక్కడ టికెట్ల రేట్ల మీద నియంత్రణా కొనసాగుతుండటంతో థియేటర్లను ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పెట్టి 8 గంటలకే థియేటర్లు మూసివేయాలని చెప్పడంతో అలా ఎందుకని మొత్తంగా థియేటర్లనే మూసేస్తున్నారు. కరోనా మళ్లీ ఎప్పటికి నియంత్రణలోకి వస్తుందో.. థియేటర్లు ఒకప్పటిలా నడిచేదెప్పుడో తెలియని అయోమయం నెలకొంది. కొన్ని రోజులు ఎదురు చూశాక పరిస్థితులు మారకపోతే మళ్లీ నిర్మాతలు కొత్త చిత్రాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి పూనుకోవడం ఖాయం. ఓటీటీలు కూడా ఆ దిశగా సానుకూలంగానే స్పందించే అవకాశముంది.
This post was last modified on April 21, 2021 3:45 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…