Movie News

ఆ జానర్‌కు చరమగీతం పాడేసిన ‘సైనా’

స్పోర్ట్స్ బయోపిక్.. కొన్నేళ్ల ముందు బాలీవుడ్లో మంచి గిరాకీ ఉన్న సినిమా. భారత అథ్లెటిక్స్ దిగ్గజం మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా తీసిన ‘బాగ్ మిల్కా బాగ్’.. ఆటల్లో అన్యాయానికి గురై బందిపోటుగా మారిన పాన్ సింగ్ తోమర్ మీద తీసిన ‘పాన్ సింగ్ తోమర్’.. అత్యంత సామాన్య నేపథ్యం వచ్చి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది క్రికెట్ అభిమానులను సంపాదించుకున్న ఎం.ఎస్.ధోని జీవిత నేపథ్యంలో తెరకెక్కించిన ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ అద్భుత విజయాలు సాధించాక ఈ జానర్‌‌కు మాంచి డిమాండ్ ఏర్పడింది. వరుసబట్టి మరిన్ని స్పోర్ట్స్ బయోపిక్స్ అనౌన్స్ చేశారు.

ఐతే ఎవరి కథను తీస్తే, ఎలా తీస్తే ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు అని గుర్తించడంలో ఫిలిం మేకర్స్ విఫలమయ్యారు. సచిన్ మీద డాక్యుమెంటరీ తరహాలో ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ తీస్తే అది ప్రేక్షకులకు రుచించలేదు. మేరీకోమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా కూడా అంతగా ఆడలేదు.

తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మీద తీసిన ‘సైనా’ అయితే ఈ జానర్‌కు దాదాపు చరమగీతం పాడేసిందని చెప్పొచ్చు. లెజెండరీ స్టేటస్ అందుకున్న ఒకప్పటి క్రీడాకారుల గురించి సినిమా తీయడం బాగుంటుంది. లేదంటే ఇప్పటి క్రీడాకారుల గురించి కూడా మనకు తెలియని విషయాలు చూపిస్తే సినిమా వర్కవుట్ అవుతంది. ఇప్పుడు ఆటలో కొనసాగుతున్న వ్యక్తుల జీవితాలను ఎమోషన్ లేకుండా, అందరికీ తెలిసిన విషయాలనే చూపిస్తే ఏం ఆసక్తి ఉంటుంది? ‘సైనా’ సినిమా విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో కనీస ఆసక్తి చూపించలేదు. ట్రైలర్ చూసినపుడే చాలా పేలవంగా అనిపించింది. కొత్తగా ఏమీ కనిపించలేదు.

ఈ సినిమాకు రిలీజ్ ఖర్చులు కూడా రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఈ దెబ్బకు ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్న సింధు, గోపీచంద్ లాంటి వాళ్ల బయోపిక్స్ సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పటికే ఇవి పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరిగింది. ఇప్పుడు ‘సైనా’కు ఎదురైన పరాభవం చూశాక ఈ సినిమాలను ఆపేసినా ఆశ్చర్యం లేదు. మన ముందు యాక్టివ్‌గా ఉన్న క్రీడాకారుల జీవితాలపై సినిమాలు తీయకపోవడమే మంచిదన్న అభిప్రాయం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

This post was last modified on April 8, 2021 7:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

13 minutes ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

36 minutes ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

43 minutes ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

1 hour ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

2 hours ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

2 hours ago