రంగ్దె సినిమాలో హీరో హీరోయిన్లు నితిన్-కీర్తి సురేష్ల కెమిస్ట్రీనే మేజర్ హైలైట్ లాగా కనిపిస్తోంది. సినిమా అంతటా వీళ్లిద్దరి మధ్య గిల్లి కజ్జాలు ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమైంది. బయట కూడా తమ పాత్రలకు తగ్గట్లే నితిన్, కీర్తి ఒకరిపై ఒకరు పంచులేసుకుంటూ సినిమా ప్రమోషన్ను నడిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఒరవడి కొనసాగుతోంది. సినిమాకు సంబంధించి ఈవెంట్లలో అయితే చెప్పాల్సిన పని లేదు.
కర్నూలులో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు కీర్తి డుమ్మా కొట్టిందంటూ కౌంటర్ వేశాడు. తర్వాత ఆమె ప్రమోషన్లకు రావట్లేదంటూ ట్వీట్ వేయడమూ తెలిసిందే. తాజాగా రాజమండ్రిలో జరిగిన రిలీజ్ ఈవెంట్లోనూ నితిన్-కీర్తి ఒకరిపై ఒకరు పంచ్లు వేసుకోవడం విశేషం.
రంగ్దె ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో తాను విలన్ అనిపించేలా ఉందని.. కానీ అది నిజం కాదని అంది కీర్తి సురేష్. తాను అలా ప్రవర్తించడానికి కారణమేంటో సినిమా ద్వితీయార్ధంలో తెలుస్తుందని.. అది తెలియకుండా దాచి పెట్టారని ఆమె అంది. ట్రైలర్లో కనిపించే తన ప్రవర్తన అంతా ప్రతీకారంలో భాగం అని.. అసలేం జరిగింది, నితిన్ ఏం చేశాడన్నది సెకండాఫ్లో తెలుస్తుందని ఆమె అంది. సినిమాలో అసలు విలన్ నితినే అని తీర్మానించింది.
మరోవైపు నితిన్ మాట్లాడుతూ.. కీర్తి రియల్ లైఫ్ క్యారెక్టర్నే ఈ సినిమాలో చూపించారని, ఆమె బయట అందరినీ టార్చర్ చేస్తుంటుందని, అది చూసి ఇన్స్పైర్ అయి దర్శకుడు వెంకీ అట్లూరి అను పాత్రను తీర్చిదిద్దాడని, ఒకరకంగా చెప్పాలంటే రంగ్దె కీర్తి బయోపిక్ అని వ్యాఖ్యానించడం విశేషం. మొత్తానికి బయట నితిన్, కీర్తిల ఈ గిల్లి కజ్జాలు సినిమా ప్రమోషన్కు మాత్రం బాగానే ఉపయోగపడుతున్నాయి.
This post was last modified on March 25, 2021 7:29 am
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…