రంగ్దె సినిమాలో హీరో హీరోయిన్లు నితిన్-కీర్తి సురేష్ల కెమిస్ట్రీనే మేజర్ హైలైట్ లాగా కనిపిస్తోంది. సినిమా అంతటా వీళ్లిద్దరి మధ్య గిల్లి కజ్జాలు ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమైంది. బయట కూడా తమ పాత్రలకు తగ్గట్లే నితిన్, కీర్తి ఒకరిపై ఒకరు పంచులేసుకుంటూ సినిమా ప్రమోషన్ను నడిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఒరవడి కొనసాగుతోంది. సినిమాకు సంబంధించి ఈవెంట్లలో అయితే చెప్పాల్సిన పని లేదు.
కర్నూలులో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు కీర్తి డుమ్మా కొట్టిందంటూ కౌంటర్ వేశాడు. తర్వాత ఆమె ప్రమోషన్లకు రావట్లేదంటూ ట్వీట్ వేయడమూ తెలిసిందే. తాజాగా రాజమండ్రిలో జరిగిన రిలీజ్ ఈవెంట్లోనూ నితిన్-కీర్తి ఒకరిపై ఒకరు పంచ్లు వేసుకోవడం విశేషం.
రంగ్దె ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో తాను విలన్ అనిపించేలా ఉందని.. కానీ అది నిజం కాదని అంది కీర్తి సురేష్. తాను అలా ప్రవర్తించడానికి కారణమేంటో సినిమా ద్వితీయార్ధంలో తెలుస్తుందని.. అది తెలియకుండా దాచి పెట్టారని ఆమె అంది. ట్రైలర్లో కనిపించే తన ప్రవర్తన అంతా ప్రతీకారంలో భాగం అని.. అసలేం జరిగింది, నితిన్ ఏం చేశాడన్నది సెకండాఫ్లో తెలుస్తుందని ఆమె అంది. సినిమాలో అసలు విలన్ నితినే అని తీర్మానించింది.
మరోవైపు నితిన్ మాట్లాడుతూ.. కీర్తి రియల్ లైఫ్ క్యారెక్టర్నే ఈ సినిమాలో చూపించారని, ఆమె బయట అందరినీ టార్చర్ చేస్తుంటుందని, అది చూసి ఇన్స్పైర్ అయి దర్శకుడు వెంకీ అట్లూరి అను పాత్రను తీర్చిదిద్దాడని, ఒకరకంగా చెప్పాలంటే రంగ్దె కీర్తి బయోపిక్ అని వ్యాఖ్యానించడం విశేషం. మొత్తానికి బయట నితిన్, కీర్తిల ఈ గిల్లి కజ్జాలు సినిమా ప్రమోషన్కు మాత్రం బాగానే ఉపయోగపడుతున్నాయి.
This post was last modified on March 25, 2021 7:29 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…