Movie News

మోహ‌న్ బాబుతో రానా సినిమా

టాలీవుడ్ గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ఐతే రెండు మూడు దశాబ్దాల పాటు విరామం లేకుండా సినిమాలు చేసిన ఆయన గత పది పదిహేనేళ్లలో మాత్రం బాగా జోరు తగ్గించేశారు. ఎప్పుడో ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. అది కూడా సొంత బేనర్లో చేస్తున్నదే. ఆయన ప్రతిభను బయటి నిర్మాతలు ఉపయోగించుకోకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందుకు కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు.

ఐతే కొన్నేళ్ల విరామం తర్వాత మోహన్ బాబు మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు. సొంత బేనర్లో ‘సన్ ఆఫ్ ఇండియా’ చేస్తూనే.. సూర్యతో కలిసి ‘ఆకాశం నీ హద్దురా’లో నటించారు. తమిళంలో ‘పొన్నియన్ సెల్వన్’ కూడా చేస్తున్నారు. తెలుగులోనూ ఆయన బయటి బేనర్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది.

తన కొడుకు మంచు విష్ణు హీరోగా నటించిన ‘మోసగాళ్ళు’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సందర్భంగా తాను సురేష్ ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు మోహన్ బాబు. ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానా నిర్మించనున్నాడట. సినిమా పూర్తి వివరాలు వెల్లడించలేదు కానీ.. రానా ప్రస్తావన వచ్చినపుడు మోహన్ బాబు ఈ విషయం బయటపెట్టారు.

మోహన్ బాబు మాట్లాడుతున్నపుడే రానా సభా ప్రాంగణంలోకి రాగా, అతణ్ని వేదిక మీదికి పిలిచిన మోహన్ బాబు.. ‘‘ఏడు గంటలకు వస్తానని పది గంటలకు వచ్చావు. రేప్పొద్దున నువ్వు ప్రొడ్యూస్ చేయబోయే సినిమాకు నేను ఇలాగే ఆలస్యంగా వస్తే ఒప్పుకుంటావా’’ అని అడిగారు. దానికి రానా బదులిస్తూ.. ‘‘నేను తీయబోయే సినిమా మీ ఇంట్లోనే షూట్ చేస్తాం. మీరు ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడొచ్చి మీ ముందు కెమెరా పెడతాం కాబట్టి ఇబ్బంది లేదు’’ అన్నాడు. ఇది సరదా సంభాషణలాగా కనిపించినా.. తర్వాత మోహన్ బాబు సీరియస్‌గానే అసలు విషయం చెప్పారు. ఒకప్పుడు రామానాయుడి నిర్మాణంలో సినిమా చేసిన తాను.. త్వరలో రానా ప్రొడక్షన్లో నటించబోతున్నట్లు తెలిపారు.

This post was last modified on March 16, 2021 2:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

16 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

2 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

2 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

4 hours ago