సీనియర్ దర్శకుడు గుణశేఖర్ నుంచి రుద్రమదేవి తర్వాత రాబోతున్న మరో భారీ చారిత్రక చిత్రం శాకుంతలం. ఇందులో శకుంతలగా సమంత కనిపించనుండగా.. ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ను ఎంపిక చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అతను మలయాళంలో కూడా పేరున్న నటుడేమీ కాదు. ఒక సినిమానే చేశాడు.
మన వాళ్లకు అస్సలు పరిచయం లేని కొత్త నటుడిని సమంత లాంటి స్టార్ హీరోయిన్కు జోడీగా పెట్టడం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ పాత్రకు ఎవరైనా స్టార్ హీరో అయితేనే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామిగా మారిన దిల్ రాజుకు సైతం అలాంటి అభిప్రాయమే కలిగిందట. కానీ ఆయన్ని గుణశేఖర్ సమాధాన పరిచాడట. శాకుంతలం ప్రారంభోత్సవ వేడుకలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
గుణశేఖర్ శాకుంతలం లాంటి భారీ చిత్రాన్ని అనౌన్స్ చేసినపుడు ఆయనకు అండగా ఎవరైనా ఉండి, సినిమాకు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని తాను అభిప్రాయపడ్డానని.. వెంటనే మహేంద్ర అనే వ్యక్తి మీరే ఎందుకు ఉండొద్దని అన్నారని, తాను సరే అన్నాను కానీ, కథ విన్నాకే నిర్ణయం తీసుకుంటానని చెప్పానని రాజు తెలిపాడు.
తర్వాత గుణశేఖర్ తనను కలిసి కథ వినిపించాడని.. తాను సినిమా ఎలా తీయాలనుకుంటున్నానో వివరించాడని.. ఆయన చెప్పిన కథను నటీనటుల పెర్ఫామెన్స్, సాంకేతిక హంగులతో కలిపి తాను ఊహించుకున్నానని.. అప్పుడది అద్భుతంగా అనిపించిందని, గొప్ప సినిమా అవుతుందన్న నమ్మకం కుదిరిందని.. వెంటనే తాను ఈ సినిమాలో భాగస్వామి కావడానికి అంగీకరించానని రాజు వెల్లడించాడు. ఐతే దుష్యంతుడి పాత్ర వరకు వచ్చేసరికి తనలోని నిర్మాత నిద్ర లేచాడని, దేవ్ కాకుండా ఎవరైనా స్టార్ హీరో అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డానని.. కానీ అప్పటికే చేసిన ఫొటో షూట్ను గుణశేఖర్ చూపించాడని, అందులో దేవ్ను చూస్తే నిజంగా రాజులా అనిపించాడని, దీంతో అతనే ఈ పాత్రకు కరెక్ట్ అనిపించిందని దిల్ రాజు తెలిపాడు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…