జాతిరత్నాలు.. ఇప్పుడు టాలీవుడ్లో ఈ సినిమానే హాట్ టాపిక్. దీని కాస్ట్ అండ్ క్రూ చూస్తే చిన్న సినిమాలా కనిపిస్తుంది కానీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఓ పెద్ద సినిమా స్థాయిలో సందడి చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాంతంలో హౌస్ ఫుల్స్తో రన్ అవుతోందీ చిత్రం. ఈ సినిమా చూద్దామని థియేటర్లకు వెళ్లి.. టికెట్లు దొరక్క ప్రేక్షకులు వేరే సినిమాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అంతలా ఓవర్ ఫ్లోస్ ఉన్నాయి. ఇంతగా ప్రేక్షకులను అలరిస్తున్న సినిమాలో కథ అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు.
ఈ మధ్య కాలంలో కాస్త పేరున్న ఏ సినిమాలోనూ ఇంత సిల్లీ స్టోరీ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా పతాక సన్నివేశాలు చూస్తే జనాలకు దిమ్మదిరిగిపోతుంది. సినిమా చూసిన వాళ్లు వేరే వాళ్లకు ఇదీ స్టోరీ అని.. సినిమా ఇలా ముగుస్తుందని చెబితే.. ఇంత సిల్లీగా ఉంది ఇదేం సినిమా అనిపిస్తుంది. ఇలాంటి సినిమా ఎలా నచ్చిందన్న సందేహం కూడా కలుగుతుంది.
కానీ కథ గురించి, లాజిక్ గురించి ఏమాత్రం ఆలోచించనివ్వని మ్యాజిక్ ‘జాతిరత్నాలు’లో ఉంది. అల్లు అర్జున్ అన్నట్లు బుర్రలు ఈ సినిమాను ఎంజాయ్ చేయాలంటే బుర్రలు స్విచాఫ్ చేసేయాలి. సన్నివేశాల్లోని ఫన్ మీద మాత్రమే మన దృష్టి ఉండాలి. ముగ్గురు ప్రధాన పాత్రధారుల అదిరిపోయే పెర్ఫామెన్స్.. ప్రతి సన్నివేశంలోనూ బోలెడంత చమత్కారం.. పేలిపోయే పంచులతో ప్రేక్షకులకు సమయమే తెలియనివ్వదు ‘జాతిరత్నాలు’. నవ్వి నవ్వి అలసిపోయాక చివర్లో కొన్ని సిల్లీ సీన్లు వస్తాయి. వేరే సినిమాలో ఇలాంటి ముగింపు ఉంటే ప్రేక్షకులకు చికాకు పుడుతుంది. కానీ ‘జాతిరత్నాలు’లో అప్పటిదాకా ఉన్న ఎంటర్టైన్మెంట్ వల్ల ముగింపును లైట్ తీసుకుంటారు.
ఐతే తెరమీద మనల్ని అంత వరకు బాగా ఎంటర్టైన్ చేశారు కాబట్టి మనం సర్దుకుపోతాం. కానీ ఈ కథ చెప్పి దర్శకుడు అనుదీప్.. నిర్మాత నాగ్ అశ్విన్ను ఎలా ఒప్పించాడన్నదే ఆశ్చర్యకరం. కథ విన్న ఎవరికైనా మరీ సిల్లీగా ఉందనే అనిపిస్తుంది. అనుదీప్ అప్పటికే పేరున్న దర్శకుడైతే నమ్మడానికి అవకాశముంటుంది. కానీ అతను తీసిన ఒక్క సినిమా. ‘పిట్టగోడ’ పేరుతో వచ్చిన ఆ సినిమా ఆడలేదు. అలాంటపుడు ఈ కుర్ర దర్శకుడిని నమ్మి.. అతను ఫన్ జనరేట్ చేయగలడన్న భరోసాతో సినిమా నిర్మించడానికి ముందుకు రావడం గొప్ప విషయమే. అందుకు నాగ్ అశ్విన్ను అభినందించాలి.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…