Movie News

తండ్రీ కొడుకుల సినిమా మొదలైంది

కోలీవుడ్లో ఒక ఆసక్తికర, క్రేజీ కాంబినేషన్లో సినిమా మొదలైంది. సీనియర్ కథానాయకుడు విక్రమ్, అతడి కొడుకు ధ్రువ్ విక్రమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం బుధవారమే సెట్స్ మీదికి వెళ్లింది. ఈ సినిమాను విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరైన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో విక్రమ్‌కు జోడీగా సిమ్రాన్ నటిస్తుండటం గమనార్హం. సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్నాడు. విక్రమ్, ధ్రువ్ కలయికలో సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌ ‘ఆదిత్య వర్మ’తో ధ్రువ్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య బాల దర్శకత్వంలో మొదలైన ‘అర్జున్ రెడ్డి’ ఫస్ట్ వెర్షన్ ‘వర్మ’ ఔట్ పుట్ తేడా కొట్టడంతో దాన్ని పక్కన పడేయడం.. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ అసిస్టెంట్ డైరెక్టర్ గిరీశయ్యతో ‘ఆదిత్య వర్మ’ను తీయడం.. ఆ చిత్రం ఏడాదిన్నర కిందట విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్నందుకోవడం తెలిసిందే. ఆ తర్వాత ధ్రువ్ హీరోగా మరో సినిమా ఏదీ మొదలు కాలేదు. తండ్రితో కలిసి చేస్తున్నదే అతడి రెండో సినిమా. విక్రమ్‌కు ఇది 60వ సినిమా కావడం విశేషం.

కార్తీక్ దర్శకత్వంలో విక్రమ్, ధ్రువ్ నటిస్తుండటంతో వీరి పాత్రలు ఎంత కొత్తగా, సంచలనాత్మకంగా ఉంటాయో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి తెరపై తండ్రీ కొడుకులుగా నటిస్తారా.. లేదా ఇద్దరి మధ్య వైరాన్ని చూపిస్తారా అన్నది ఆసక్తికరం. విక్రమ్ ప్రస్తుతం ‘కోబ్రా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. తెలుగులోనూ రిలీజైన ‘డిమాంటి కాలని’, ‘అంజలి ఐపీఎస్’ చిత్రాల దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. విక్రమ్ ఇందులో బహుముఖ పాత్రలు చేస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో అది ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on March 10, 2021 6:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

27 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago