స్టార్ హీరోలు వేదికల మీద మాట్లాడుతుంటే.. వారి దృష్టిని ఆకర్షించడానికి అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించడం మామూలే. ఉన్నట్లుండి స్టేజ్ మీదికి వచ్చి హీరోల కాళ్ల మీద పడిపోవడం.. వాళ్లను గట్టిగా హత్తుకోవడం లాంటివి చేస్తుంటారు. చాలామంది హీరోలు వీటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. తప్పని చెబుతుంటారు. ఇలాంటి ఆరాధన భావాన్ని ఎంజాయ్ చేసే హీరోలు కూడా లేకపోలేదు. ఇలాంటివి పనిగట్టుకుని ప్లాన్ చేసి మరీ చేయించుకునే హీరోలూ లేకపోలేదు.
ఐతే ప్లాన్ చేసినా చేయకున్నా.. పెద్ద పెద్ద స్టార్ల విషయంలో ఇలా జరగడం అయితే మామూలే. కానీ నవీన్ పొలిశెట్టి అనే చిన్న హీరో విషయంలో ఇలా జరిగితే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. తన కొత్త చిత్రం ‘జాతిరత్నాలు’ ప్రమోషన్లో భాగంగా వైజాగ్ ఆర్కే బీచ్లో జరిగిన ఒక ఈవెంట్కు నవీన్ పొలిశెట్టి హాజరయ్యాడు. ఈ సందర్భంగా వేదిక మీద అతను మాట్లాడుతుండగా ఒక అనూహ్య పరిణామం జరిగింది.
ఉన్నట్లుండి కొంత మంది కుర్రాళ్లు వేదిక మీదికి దూసుకొచ్చేశారు. అందులో ఒక చిన్నబ్బాయి నేరుగా నవీన్ కాళ్ల మీద పడిపోయాడు. వదలకుండా గట్టిగా పట్టేసుకున్నాడు. దీంతో అవాక్కయిన నవీన్ అతణ్ని పైకి లేపి హత్తుకున్నాడు. ఇలాంటివి తప్పని, ఎప్పుడు చేయొద్దని వారించాడు. అంతటితో ఆగకుండా.. ‘‘నువ్విలా చేస్తే నేనేదో ప్లాన్ చేసి చేయించానని అనుకుంటారు’’ అనడంతో ఆ ప్రాంగణం మొత్తం హోరెత్తిపోయింది. ‘‘ఇది నేను చేయించలేదు అని చెప్పు’’ అని ఆ కుర్రాడితో అనడంతో అతను తనకు తానుగా ఇలా చేశానని వెల్లడించాడు.
తన మీద ప్రేమ చూపించాలని, కానీ ఇలా కింద కాకుండా పైన పట్టుకుని ప్రేమించాలని నవీన్ చమత్కరించడంతో ఆ వేడుకలో మరోసారి నవ్వులు విరిశాయి. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇలా ప్లాన్ చేసి చేయించుకునే హీరోలకు కౌంటర్ లాగా ఈ వీడియోను చూపిస్తున్నారు. అలాగే నవీన్ సెన్సాఫ్ హ్యూమర్ను కొనియాడుతున్నారు.
This post was last modified on March 6, 2021 5:08 pm
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…