‘ఉప్పెన’ సినిమాతో కొత్తమ్మాయి కృతి శెట్టి దశ తిరిగిపోయింది. గత కొన్నేళ్లలో మరే కొత్త కథానాయికకూ తొలి సినిమాతో ఇంత మంచి పేరు, క్రేజ్ రాలేదు. ‘ఉప్పెన’ రిలీజ్ కాకముందే మూడు సినిమాల్లో ఆమె బుక్ అయిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ మూడూ కూడా క్రేజీ సినిమాలే కావడం విశేషం. తొలి చిత్రం రిలీజ్ కాకముందే ఆమె కెరీర్ ఇంత ఊపులో ఉంటే.. ఈ సినిమా రిలీజై బ్లాక్బస్టర్ అయిన నేపథ్యంలో మున్ముందు ఆమె జోరెలా ఉంటుందో?
ఐతే ఇంతగా ఆమెకు కలిసొచ్చిన ‘ఉప్పెన’ చిత్రంలో తనసలు నటించాల్సిందే కాదు. ఆమె ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ కాదన్న సంగతి చాలామందికి తెలియదు. ‘ఉప్పెన’ ప్రారంభోత్సవంలో ఈ చిత్ర కథానాయికగా కనిపించిన అమ్మాయి వేరు. ఇంతకుముందు సునీల్ హీరోగా నటించిన ‘2 కంట్రీస్’లో కథానాయికగా నటించిన మనీషా రాజ్ అనే అమ్మాయిని ‘ఉప్పెన’కు కథానాయికగా ఎంచుకున్నాడు బుచ్చిబాబు.
‘ఉప్పెన’ ప్రారంభోత్సవంలోనూ మనీషా పాల్గొంది. కానీ తర్వాత అనూహ్యంగా ఆమె స్థానంలోకి కృతి వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు అనుకోకుండా ఫేస్ బుక్లో కృతి ఫొటోలు చూసి ఫిదా అయిపోయాడట. తన కథలో బేబమ్మ పాత్రకు ఈ అమ్మాయే కరెక్ట్ అనుకున్నాడట. కానీ ఒకసారి హీరోయిన్ని ఎంచుకుని ప్రారంభోత్సవంలోనూ ఆ అమ్మాయి పాల్గొన్నాక తప్పించడం ఎలా అని సందేహించాడట.
ఇదే విషయం తన గురువు సుకుమార్ దగ్గర చెబితే.. నీకేమనిపిస్తే అది చెయ్యమని, కథకు ఎవరు బాగుంటారో వాళ్లనే తీసుకోమని సలహా ఇచ్చాడట. దీంతో అతను ధైర్యం చేసి మనీషాను తప్పించి కృతిని ఎంచుకున్నాడు. కృతి, మనీషాలను పక్క పక్కన పెట్టి చూస్తే ‘ఉప్పెన’కు ఎవరు పర్ఫెక్ట్ అనే విషయం స్పష్టమైపోతుంది. మనీషా బేబమ్మ పాత్రకు అంత బాగుండేది కాదేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో కృతి నటించకపోయి ఉంటే అన్న ఊహే ఇప్పుడు ప్రేక్షకులను ఇబ్బందికి గురి చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ అవకాశం ఆమె జీవితాన్ని ఎంతగా మార్చిందో చెప్పేదేముంది?
This post was last modified on February 22, 2021 7:15 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…