కరోనా-లాక్ డౌన్ కారణంగా దాదాపు పది నెలలు ఆలస్యంగా, ఈ శుక్రవారం విడుదలైంది ‘ఉప్పెన’ సినిమా. కరోనా టైంలో ఈ చిత్రానికి ఓటీటీల నుంచి మంచి మంచి ఆఫర్లు వచ్చినట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. కానీ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడమేంటి అన్న ఉద్దేశంతోనో ఏమో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు తొందరపడలేదు.
థియేటర్లు తెరుచుకోవడంలో బాగా ఆలస్యం జరిగినా వేచి చూశారు. థియేటర్ల పున:ప్రారంభం తర్వాత కూడా సినిమాను రిలీజ్ చేసే విషయంలో తొందరపడలేదు. చివరికి సినిమాను గట్టిగా ప్రమోట్ చేసి, మంచి టైమింగ్ చూసి ఈ వారం విడుదల చేశారు. సినిమాకు అన్నీ కలిసొచ్చి అనూహ్యమైన హైప్ వచ్చింది. ఒక స్టార్ హీరో సినిమా స్థాయిలో దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ రాబోతున్నాయని స్పష్టమైంది. సినిమా ‘హిట్’ స్థాయి అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
ఐతే ‘ఉప్పెన’ టైటిల్స్ ఆరంభంలోనే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్లో అతి త్వరలోనే రిలీజ్ కాబోతోందని అనౌన్స్మెంట్ ఇచ్చేయడం విశేషం. నెట్ ఫ్లిక్స్ రిలీజ్ అని చెప్పడమే ఎక్కువంటే.. కమింగ్ సూన్ అని కూడా పేర్కొనడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇలా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తూ అతి త్వరలో నెట్ ఫ్లిక్స్లో రాబోతోందని చెప్పడమంటే ఎగ్జిబిటర్లకు మంట పుట్టించేదే. అదే సమయంలో ప్రేక్షకులు థియేటర్లలోనే సినిమా చూడాలనేమీ లేదని.. త్వరలోనే ఇంట్లో కూర్చుని ఓటీటీలో చూసుకోవచ్చని హింట్ ఇస్తున్నట్లే.
బహుశా మాస్టర్, క్రాక్ సినిమాల మాదిరే ఈ చిత్రాన్ని కూడా థియేటర్లలో రిలీజైన రెండు మూడు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేసేలా పెద్ద మొత్తానికి ఒప్పందం చేసుకుని ఉండొచ్చేమో. ఇలా థియేట్రికల్ రిలీజ్కు, ఓటీటీ రిలీజ్కు మధ్య గ్యాప్ అంతకంతకూ తగ్గిపోతుండటం పట్ల ఇప్పటికే ఎగ్జిబిటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఉప్పెన’ విషయంలోనూ అలాగే జరిగితే వాళ్లెలా స్పందిస్తారో చూడాలి మరి.
This post was last modified on February 12, 2021 7:16 pm
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…