అన్షు.. తెలుగులో ఈ అమ్మాయి చేసింది రెండు సినిమాలే. కానీ తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా ఆ అమ్మాయిని మరిచిపోలేరు. తన తొలి చిత్రంతో ఆమె వేసిన ముద్ర అలాంటిది మరి. మన్మథుడు సినిమాలో సోనాలి బింద్రే కూడా చక్కటి పాత్రతో మెరిసింది కానీ.. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే మహేశ్వరి పాత్ర యువ హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. ఆ పాత్ర కోసమే పుట్టిందా అన్నట్లుగా ఎంతో సున్నితమైన అందం, నటనతో అన్షు అందరినీ ఆకట్టుకుంది.
రెండో సినిమా రాఘవేంద్ర ఫ్లాప్ కావడంతో అన్షు ఉన్నట్లుండి టాలీవుడ్ నుంచి అదృశ్యం అయిపోయింది. తర్వాత ఇంకెక్కడా కూడా కనిపించలేదు. ఆమె చాలా ఏళ్ల కిందటే పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిల్ అయిపోయింది. ఐతే మన్మథుడు వచ్చిన 17 ఏళ్ల తర్వాత ఆమె టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఓ ఆసక్తికర కబురు చక్కర్లు కొడుతోంది.
తన రచనతో మన్మథుడు సినిమాను క్లాసిక్గా నిలబెట్టిన త్రివిక్రమ్.. ఇప్పుడు తన దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో ఓ కీలక పాత్రకు అన్షును తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. గత ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి హిట్ కొట్టిన మాటల మాంత్రికుడు.. ఇక అప్పట్నుంచి ఎన్టీఆర్తో సినిమా కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం మేలో మొదలయ్యే అవకాశముంది. ఇందులో ఎన్టీఆర్ అక్కగా సినిమాలో కీలక పాత్రకు అన్షును అడిగారట.
సినిమాల మీద ఆసక్తే లేనట్లు వెళ్లిపోయిన అన్షు.. ఈ క్రేజీ ప్రాజెక్టులో చేయడానికి ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. ఆమె ఈ సినిమాలో నటిస్తే మన్మథుడు సినిమాను మధుర జ్ఞాపకంగా మార్చుకున్న ఎంతోమంది ప్రేక్షకులకు ఒక నోస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుందనడంలో సందేహం లేదు. మరి వార్త ఎంత వరకు నిజమో చూడాలి.
This post was last modified on February 8, 2021 11:03 am
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…