అన్షు.. తెలుగులో ఈ అమ్మాయి చేసింది రెండు సినిమాలే. కానీ తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా ఆ అమ్మాయిని మరిచిపోలేరు. తన తొలి చిత్రంతో ఆమె వేసిన ముద్ర అలాంటిది మరి. మన్మథుడు సినిమాలో సోనాలి బింద్రే కూడా చక్కటి పాత్రతో మెరిసింది కానీ.. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే మహేశ్వరి పాత్ర యువ హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. ఆ పాత్ర కోసమే పుట్టిందా అన్నట్లుగా ఎంతో సున్నితమైన అందం, నటనతో అన్షు అందరినీ ఆకట్టుకుంది.
రెండో సినిమా రాఘవేంద్ర ఫ్లాప్ కావడంతో అన్షు ఉన్నట్లుండి టాలీవుడ్ నుంచి అదృశ్యం అయిపోయింది. తర్వాత ఇంకెక్కడా కూడా కనిపించలేదు. ఆమె చాలా ఏళ్ల కిందటే పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిల్ అయిపోయింది. ఐతే మన్మథుడు వచ్చిన 17 ఏళ్ల తర్వాత ఆమె టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఓ ఆసక్తికర కబురు చక్కర్లు కొడుతోంది.
తన రచనతో మన్మథుడు సినిమాను క్లాసిక్గా నిలబెట్టిన త్రివిక్రమ్.. ఇప్పుడు తన దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో ఓ కీలక పాత్రకు అన్షును తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. గత ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి హిట్ కొట్టిన మాటల మాంత్రికుడు.. ఇక అప్పట్నుంచి ఎన్టీఆర్తో సినిమా కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం మేలో మొదలయ్యే అవకాశముంది. ఇందులో ఎన్టీఆర్ అక్కగా సినిమాలో కీలక పాత్రకు అన్షును అడిగారట.
సినిమాల మీద ఆసక్తే లేనట్లు వెళ్లిపోయిన అన్షు.. ఈ క్రేజీ ప్రాజెక్టులో చేయడానికి ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. ఆమె ఈ సినిమాలో నటిస్తే మన్మథుడు సినిమాను మధుర జ్ఞాపకంగా మార్చుకున్న ఎంతోమంది ప్రేక్షకులకు ఒక నోస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుందనడంలో సందేహం లేదు. మరి వార్త ఎంత వరకు నిజమో చూడాలి.
This post was last modified on February 8, 2021 11:03 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…