కన్నడలో రెండేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై మంచి విజయం సాధించిన సినిమా కవుల్దారి. రిషి అనే పెద్దగా పేరు లేని హీరోను పెట్టి హేమంత్ రావు ఈ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు. ఇది తమిళ నిర్మాత ధనుంజయన్కు బాగా నచ్చేసి తెలుగు, తమిళ భాషల్లో రీమేక్కు శ్రీకారం చుట్టాడు. ముందు రాజశేఖర్ను లీడ్ రోల్కు ఎంచుకున్నారు కానీ.. ఆయన కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ స్థానంలోకి సుమంత్ వచ్చాడు.
తమిళంలో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించాడీ సినిమాలో. ఇంతకుముందు విజయ్ ఆంటోనీ హీరోగా బేతాళుడు అనే సినిమా తీసిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకుడు. గత నెల చివర్లోనే తమిళ వెర్షన్ విడుదలైంది మంచి రివ్యూలు కూడా తెచ్చుకుంది. బాగానే ఆడుతోంది. తెలుగులో మాత్రం విడుదల విషయంలో కొంచెం జాప్యం జరిగింది.
తెలుగులో కపటదారి పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పుడు నిర్ణయం మారింది. వారం ముందుగా, అంటే ఫిబ్రవరి 19నే కపటదారి విడుదల కాబోతోంది. నిజానికి ఈ తేదీన నితిన్ సినిమా చెక్ రావాల్సింది. కారణాలేంటో తెలియదు కానీ ఆ సినిమాను అనూహ్యంగా 26కు వాయిదా వేశారు.
ఇప్పటికే ఆ రోజుకు ఎ1 ఎక్స్ప్రెస్, అక్షర సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. చెక్ కూడా వస్తే పోటీ మరీ ఎక్కువవుతుంది. ఎలాగూ ఫస్ట్ కాపీతో రెడీగా ఉండటంతో అంత పోటీలో ఎందుకని ఖాళీ అయిన ముందు వారాన్ని ఎంచుకున్నట్లుంది కపటదారి టీం. మళ్ళీ రావాతో ఫామ్ అందుకున్నట్లే అందుకుని మళ్లీ తడబడ్డ సుమంత్కు ఈ సినిమా హిట్టవడం చాలా అవసరం. ట్రైలర్ చూస్తే ఈసారి అతను మంచి ఫలితాన్నే అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…