తమిళ అగ్ర దర్శకుడు శంకర్ను ఎప్పట్నుంచో వెంటాడుతున్న ఓ వివాదం ఇప్పుడు అతడిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. అతడికి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే పరిస్థితి తలెత్తింది. పదేళ్ల కిందట విడుదలైన శంకర్ మాస్టర్ పీస్ రోబోకు సంబంధించిన వివాదంలో అతనిప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఇంతకీ విషయం ఏంటంటే..
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో శంకర్ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ మూవీ రోబో 2010లో విడులై ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. శంకర్, రజినీ కెరీర్లలో ఇది బిగ్టెస్ట్ హిట్గా నిలిచింది. సౌత్ సినిమా స్థాయిని ఎంతో పెంచిన చిత్రమిది. ఐతే రోబో కథ తనదే అంటూ అరుర్ తమిళ్ నందన్ అనే రచయిత సినిమా రిలీజైన కొత్తలో శంకర్పై కేసు వేశాడు. తాను రాసిన జిగుబా అనే కథను కాపీ చేసి దర్శకుడు శంకర్ రోబో చిత్రాన్ని తెరకెక్కించాడని అరుల్ ఆరోపించాడు.
1996లో అరుర్ రాసిన ఈ కథ ఓ తమిళ మ్యాగజైన్లో ప్రచురితమైంది. ఆ తర్వాత 2007లో దీనిని ఓ నవలగా కూడా ముద్రించారు. అరుర్ కేసు ఎన్నో ఏళ్లుగా కోర్టులో నానుతోంది. ఐతే ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు పలుమార్లు ఆదేశించినప్పటికీ శంకర్ అస్సలు స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు శంకర్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేస్తూ కేసును ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.
శంకర్ ముందే స్పందించి ఉంటే, లేదా రచయితతో రాజీ కుదుర్చుకుని ఉంటే ఎప్పుడో వివాదం సమసిపోయేది. కానీ అతను ఈ కేసును పట్టించుకోకపోవడంతో సినిమా రిలీజైన పదేళ్ల తర్వాత కాపీ వివాదం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ అందుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు శంకర్ ఏం చేస్తాడో, ఆరోపణలపై ఎలా స్పందిస్తాడో చూడాలి.
This post was last modified on February 1, 2021 7:55 am
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…