తెలుగువాడైన బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలిసి టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కొన్నేళ్ల కిందట రామాయణ గాథతో భారీ సినిమా తీయబోతున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ ప్రకటన వచ్చాక చాలా సమయం గడిచిపోయింది. ఈ సినిమా పట్టాలెక్కనే లేదు. ఒక దశలో ఈ చిత్రం ఉంటుందా లేదా అన్న సందేహాలు కూడా కలిగాయి.
కానీ అతి త్వరలో అల్లు వారి రామాయణం సెట్స్ మీదికి వెళ్లబోతోందని తెలుస్తోంది. అరవింద్ ఇక్కడే హైదరాబాద్లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా.. ముంబయిలో మధు మంతెన చకచకా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దంగల్ దర్శకుడు నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ఎపిక్ మూవీలో రావణుడి పాత్రను పోషించేదెవరన్న దానిపై స్పష్టత వచ్చేసినట్లే అంటోంది బాలీవుడ్ మీడియా.
బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ ఈ చిత్రంలో రావణుడిగా కనిపించనున్నాడట. దీని గురించి ఇంతకముందే ఊహాగానాలు నడిచాయి కానీ.. ఇప్పుడు అతనే రావణుడిగా ఖరారైనట్లు బాలీవుడ్ మీడియా జోరుగా వార్తలిస్తోంది. హృతిక్ అనగానే రాముడి పాత్ర చేస్తాడేమో అనుకుంటాం కానీ.. అతణ్ని రావణుడి పాత్రకు ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ చిత్రంలో సీతగా దీపికా పదుకొనే కనిపించబోతోందని బాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
కానీ అత్యంత కీలకమైన రాముడి పాత్రను ఎవరు చేస్తారన్నది ఆసక్తికరం. హృతిక్ చేశాడంటే రావణుడి పాత్ర స్థాయే మారిపోతుంది. అలాంటపుడు రాముడిగా అతణ్ని మించిన హీరో ఉండాలి. మరి ఆ పాత్ర ఎవరు చేస్తారో ఏమో? దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని, అంతకంటే ముందు గ్రాండ్ లాంచింగ్ ఉంటుందని సమాచారం.
This post was last modified on January 31, 2021 10:55 am
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…