తెలుగువాడైన బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలిసి టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కొన్నేళ్ల కిందట రామాయణ గాథతో భారీ సినిమా తీయబోతున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ ప్రకటన వచ్చాక చాలా సమయం గడిచిపోయింది. ఈ సినిమా పట్టాలెక్కనే లేదు. ఒక దశలో ఈ చిత్రం ఉంటుందా లేదా అన్న సందేహాలు కూడా కలిగాయి.
కానీ అతి త్వరలో అల్లు వారి రామాయణం సెట్స్ మీదికి వెళ్లబోతోందని తెలుస్తోంది. అరవింద్ ఇక్కడే హైదరాబాద్లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా.. ముంబయిలో మధు మంతెన చకచకా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దంగల్ దర్శకుడు నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ఎపిక్ మూవీలో రావణుడి పాత్రను పోషించేదెవరన్న దానిపై స్పష్టత వచ్చేసినట్లే అంటోంది బాలీవుడ్ మీడియా.
బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ ఈ చిత్రంలో రావణుడిగా కనిపించనున్నాడట. దీని గురించి ఇంతకముందే ఊహాగానాలు నడిచాయి కానీ.. ఇప్పుడు అతనే రావణుడిగా ఖరారైనట్లు బాలీవుడ్ మీడియా జోరుగా వార్తలిస్తోంది. హృతిక్ అనగానే రాముడి పాత్ర చేస్తాడేమో అనుకుంటాం కానీ.. అతణ్ని రావణుడి పాత్రకు ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ చిత్రంలో సీతగా దీపికా పదుకొనే కనిపించబోతోందని బాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
కానీ అత్యంత కీలకమైన రాముడి పాత్రను ఎవరు చేస్తారన్నది ఆసక్తికరం. హృతిక్ చేశాడంటే రావణుడి పాత్ర స్థాయే మారిపోతుంది. అలాంటపుడు రాముడిగా అతణ్ని మించిన హీరో ఉండాలి. మరి ఆ పాత్ర ఎవరు చేస్తారో ఏమో? దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని, అంతకంటే ముందు గ్రాండ్ లాంచింగ్ ఉంటుందని సమాచారం.
This post was last modified on January 31, 2021 10:55 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…