తెలుగువాడైన బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలిసి టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కొన్నేళ్ల కిందట రామాయణ గాథతో భారీ సినిమా తీయబోతున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ ప్రకటన వచ్చాక చాలా సమయం గడిచిపోయింది. ఈ సినిమా పట్టాలెక్కనే లేదు. ఒక దశలో ఈ చిత్రం ఉంటుందా లేదా అన్న సందేహాలు కూడా కలిగాయి.
కానీ అతి త్వరలో అల్లు వారి రామాయణం సెట్స్ మీదికి వెళ్లబోతోందని తెలుస్తోంది. అరవింద్ ఇక్కడే హైదరాబాద్లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా.. ముంబయిలో మధు మంతెన చకచకా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దంగల్ దర్శకుడు నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ఎపిక్ మూవీలో రావణుడి పాత్రను పోషించేదెవరన్న దానిపై స్పష్టత వచ్చేసినట్లే అంటోంది బాలీవుడ్ మీడియా.
బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ ఈ చిత్రంలో రావణుడిగా కనిపించనున్నాడట. దీని గురించి ఇంతకముందే ఊహాగానాలు నడిచాయి కానీ.. ఇప్పుడు అతనే రావణుడిగా ఖరారైనట్లు బాలీవుడ్ మీడియా జోరుగా వార్తలిస్తోంది. హృతిక్ అనగానే రాముడి పాత్ర చేస్తాడేమో అనుకుంటాం కానీ.. అతణ్ని రావణుడి పాత్రకు ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ చిత్రంలో సీతగా దీపికా పదుకొనే కనిపించబోతోందని బాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
కానీ అత్యంత కీలకమైన రాముడి పాత్రను ఎవరు చేస్తారన్నది ఆసక్తికరం. హృతిక్ చేశాడంటే రావణుడి పాత్ర స్థాయే మారిపోతుంది. అలాంటపుడు రాముడిగా అతణ్ని మించిన హీరో ఉండాలి. మరి ఆ పాత్ర ఎవరు చేస్తారో ఏమో? దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని, అంతకంటే ముందు గ్రాండ్ లాంచింగ్ ఉంటుందని సమాచారం.
This post was last modified on January 31, 2021 10:55 am
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…