ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ చిత్రీకరణ మొదలైందని ఇటీవల రాజమౌళి ప్రకటించగానే ఎన్టీఆర్ అభిమానులు హమ్మయ్య అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు తారక్ అంకితమై రెండేళ్లు దాటిపోయింది. రామ్ చరణ్ అయినా మధ్యలో బ్రేక్ తీసుకుని ఆచార్యలో ప్రత్యేక పాత్ర కోసం షూటింగ్కు హాజరవుతున్నాడు. కానీ తారక్ ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా చిత్రీకరణకే పరిమితం అవుతున్నాడు.
రాజమౌళితో సినిమా అంటే ఎంతకీ తెగని వ్యవహారం. పరిస్థితి చూస్తే తారక్ కెరీర్లో మూడేళ్ల గ్యాప్ వచ్చేసేలా కనిపించింది. ఈ ఏడాది ఇంకో సినిమా మొదలుపెడతాడా లేదా అన్న సందేహాలు కూడా కలిగాయి ఒక సమయంలో. ఐతే క్లైమాక్స్ చిత్రీకరణతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ దాదాపు అయిపోతుందని, తారక్ ఇంకో రెండు నెలల్లో ఈ సినిమా నుంచి విముక్తుడవుతాడని సంకేతాలు రావడం అతడి అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది.
మరి కొన్ని నెలల్లోనే తారక్ త్రివిక్రమ్తో తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తాజా సమాచారం అందుతోంది. మే 20న తన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు కొబ్బరికాయ కొడతాడట. అక్కడ్నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుందట. త్రివిక్రమ్ కూడా ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఇంకెంతమాత్రం ఆలస్యం చేయాలనుకోవట్లేదు.
అరవింద సమేత తర్వాత వీళ్లిద్దరూ మరోసారి హారిక అండ్ హాసిని బేనర్లోనే ఈ సినిమాచేయనున్నారు. ఆ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన తమనే దీనికీ సంగీత దర్శకుడు. తారక్ సరసన ఓ కథానాయికగా జాన్వి కపూర్ను తీసుకుందామని అనుకుంటున్నారట. ఈ చిత్రం రాజకీయాల నేపథ్యంలో నడుస్తుందంటున్నారు. అయిననూ పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ఈ చిత్రానికి ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 26, 2021 8:34 am
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…
మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులకు ఆయన ఈ విషయంలో…