ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ చిత్రీకరణ మొదలైందని ఇటీవల రాజమౌళి ప్రకటించగానే ఎన్టీఆర్ అభిమానులు హమ్మయ్య అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు తారక్ అంకితమై రెండేళ్లు దాటిపోయింది. రామ్ చరణ్ అయినా మధ్యలో బ్రేక్ తీసుకుని ఆచార్యలో ప్రత్యేక పాత్ర కోసం షూటింగ్కు హాజరవుతున్నాడు. కానీ తారక్ ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా చిత్రీకరణకే పరిమితం అవుతున్నాడు.
రాజమౌళితో సినిమా అంటే ఎంతకీ తెగని వ్యవహారం. పరిస్థితి చూస్తే తారక్ కెరీర్లో మూడేళ్ల గ్యాప్ వచ్చేసేలా కనిపించింది. ఈ ఏడాది ఇంకో సినిమా మొదలుపెడతాడా లేదా అన్న సందేహాలు కూడా కలిగాయి ఒక సమయంలో. ఐతే క్లైమాక్స్ చిత్రీకరణతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ దాదాపు అయిపోతుందని, తారక్ ఇంకో రెండు నెలల్లో ఈ సినిమా నుంచి విముక్తుడవుతాడని సంకేతాలు రావడం అతడి అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది.
మరి కొన్ని నెలల్లోనే తారక్ త్రివిక్రమ్తో తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తాజా సమాచారం అందుతోంది. మే 20న తన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు కొబ్బరికాయ కొడతాడట. అక్కడ్నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుందట. త్రివిక్రమ్ కూడా ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఇంకెంతమాత్రం ఆలస్యం చేయాలనుకోవట్లేదు.
అరవింద సమేత తర్వాత వీళ్లిద్దరూ మరోసారి హారిక అండ్ హాసిని బేనర్లోనే ఈ సినిమాచేయనున్నారు. ఆ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన తమనే దీనికీ సంగీత దర్శకుడు. తారక్ సరసన ఓ కథానాయికగా జాన్వి కపూర్ను తీసుకుందామని అనుకుంటున్నారట. ఈ చిత్రం రాజకీయాల నేపథ్యంలో నడుస్తుందంటున్నారు. అయిననూ పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ఈ చిత్రానికి ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…