Movie News

నన్ను స్నేహితులే మోసం చేశారు-సందీప్ కిషన్

సినీ రంగంలో మాయ మాటలు నమ్మి మోసపోయే వాళ్లకు లెక్కే లేదు. పేరున్న వారి వెంట నమ్మకంగా ఉన్న వాళ్లే మోసం చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఇలా దారుణంగా మోసపోయి రోడ్డు మీదికి వచ్చేశాడు ఓ సందర్భంలో. కానీ తర్వాత ఆయన బలంగానే పుంజుకున్నారు.

తాను కూడా క్లోజ్ ఫ్రెండ్స్‌ను నమ్మి మోస పోయానని అంటున్నాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. గత ఏడాది ‘నిను వీడని నీడను నేనే’ సినిమాకు ముందు సందీప్ కిషన్ కెరీర్ ఎంత దారుణమైన స్థితిలో ఉందో తెలిసిందే. వరుస ఫ్లాపులతో అల్లాడిపోయాడతను. ఆ సమయంలో ఆర్థికంగా చాలా నష్టపోయానని.. కొందరు క్లోజ్ ఫ్రెండ్సే తనను మోసం చేశారని సందీప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ వివరాలు వెల్లడించడానికి అతను ఇష్టపడలేదు.

ఐతే తన తప్పుల నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నానని.. ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి వాళ్లో తనకు తెలిసిందని.. తాను అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ప్రొడ్యూస్ చేసిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమా మంచి విజయం సాధించి తనను మళ్లీ నిలదొక్కుకునేలా చేసిందని సందీప్ తెలిపాడు. ప్రస్తుతం తాను ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాలో నటిస్తున్నానని.. అది తన కెరీర్లో స్పెషల్ ఫిలిం అవుతుందని సందీప్ చెప్పాడు.

ఇంతకీ ప్రేమ వ్యవహారాల సంగతేంటి అని సందీప్‌ను అడిగితే.. గత ఆరేళ్లలో తాను రెండు రిలేషన్‌షిప్స్‌లో ఉన్నానని.. అవి వర్కవుట్ కాలేదని.. ప్రస్తుతం పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టానని అతను చెప్పాడు. ప్రస్తుతం తనకు మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఎంతగానో స్ఫూర్తినిస్తున్నాడని. ‘ట్రాన్స్’ సినిమాలో అతడి నటన అద్భుతమని సందీప్ అన్నాడు. తాను నడుపుతున్న ఫుడ్ బిజినెస్‌ను మున్ముందు మరింతగా విస్తరిస్తానని తెలిపాడు సందీప్.

This post was last modified on May 5, 2020 5:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago