వాటర్ బాటిల్ను తలపించే సీసా.. అందులో ముదురు గోధుమ వర్ణంలో ద్రావణం.. దాన్ని చూస్తే సూపర్ మార్కెట్లలో స్టాండ్స్ మీద కనిపించే నువ్వుల నూనెలా అనిపిస్తుంది. కానీ దాని మీద లోగో చూస్తే మాత్రం షాకవుతాం. ‘స్పై హెచ్డీ విస్కీ’ అని రాసి ఉంది దాని మీద. 750 మిల్లీలీటర్ల పరిమాణం.. అంటే మందు బాబుల లెక్కల్లో ‘ఫుల్’ అన్నమాట. ధర 430 రూపాయలు.
అలాగే ‘ఆంధ్రా గోల్డ్’ పేరుతో మరో విస్కీ బ్రాండు. 180 మిల్లీ లీటర్ల పరిమాణంతో ఉన్న దాని ధర రూ.120. ఇప్పటిదాకా కనీ వినీ ఎరుగని బ్రాండ్లు ఇవి. కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి ఊరూ పేరు లేని బ్రాండ్లు మరెన్నో. నిన్న ఆంధ్రాలో వైన్ షాపులు రీఓపెన్ చేసిన సందర్భంగా కనిపించిన దృశ్యాలివి. ఆ బ్రాండ్లేంటో.. వాటిని ఎక్కడ తయారు చేశారో.. వాటి క్వాలిటీ ఏంటో తెలియక షాక్ తింటుున్నారు జనం.
ఐతే మందు దొరక్క పిచ్చెక్కిపోతున్న వాళ్లకు మాత్రం బ్రాండ్లతో పని లేదు. ఏది దొరికితే అది అన్నట్లుగా కొని తాగేస్తున్నారు. మామూలుగానే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అందులోనూ ఈ బ్రాండ్ల వ్యవహారం చూస్తే క్వాలిటీ దారుణంగా ఉంటుందని అర్థమవుతోంది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో పేరుమోసిన మద్యం బ్రాండ్లన్నీ పక్కకు వెళ్లిపోయాయి.
బీర్లతో పాటు విస్కీ, బ్రాందీ, రమ్.. ఇలా అన్ని రకాల మద్యాల్లోనూ లోకల్ బ్రాండ్లు వచ్చేశాయి. అధికార పార్టీ నాయకులే తక్కువ ఖర్చుతో మద్యం తయారు చేసి.. వాటికి ఇష్టమొచ్చిన బ్రాండ్ల పేర్లు తగిలించి.. మద్యం దుకాణాల్లోకి తెస్తున్నారని.. వీటి ద్వారా భారీగా ఆదాయం దండుకుంటున్నారని.. వైన్ షాపులకు కూడా కమీషన్ దండిగా వస్తుండటంతో వాళ్లు కూడా వీటినే అమ్ముతున్నారని.. ఐతే వీటితో మందు బాబుల ఆరోగ్యాలు మరింతగా గుల్లవడం ఖాయమని అంటున్నారు. కానీ మద్యపానం అన్నదే హానికరం కావడంతో ఇలాంటి వాటిపై ప్రశ్నించేదెవరు? పోరాడేదెవరు? మందుబాబులు అభ్యంతరం వ్యక్తం చేసినా ఎవరు పట్టించుకుంటారు?
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…