వాటర్ బాటిల్ను తలపించే సీసా.. అందులో ముదురు గోధుమ వర్ణంలో ద్రావణం.. దాన్ని చూస్తే సూపర్ మార్కెట్లలో స్టాండ్స్ మీద కనిపించే నువ్వుల నూనెలా అనిపిస్తుంది. కానీ దాని మీద లోగో చూస్తే మాత్రం షాకవుతాం. ‘స్పై హెచ్డీ విస్కీ’ అని రాసి ఉంది దాని మీద. 750 మిల్లీలీటర్ల పరిమాణం.. అంటే మందు బాబుల లెక్కల్లో ‘ఫుల్’ అన్నమాట. ధర 430 రూపాయలు.
అలాగే ‘ఆంధ్రా గోల్డ్’ పేరుతో మరో విస్కీ బ్రాండు. 180 మిల్లీ లీటర్ల పరిమాణంతో ఉన్న దాని ధర రూ.120. ఇప్పటిదాకా కనీ వినీ ఎరుగని బ్రాండ్లు ఇవి. కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి ఊరూ పేరు లేని బ్రాండ్లు మరెన్నో. నిన్న ఆంధ్రాలో వైన్ షాపులు రీఓపెన్ చేసిన సందర్భంగా కనిపించిన దృశ్యాలివి. ఆ బ్రాండ్లేంటో.. వాటిని ఎక్కడ తయారు చేశారో.. వాటి క్వాలిటీ ఏంటో తెలియక షాక్ తింటుున్నారు జనం.
ఐతే మందు దొరక్క పిచ్చెక్కిపోతున్న వాళ్లకు మాత్రం బ్రాండ్లతో పని లేదు. ఏది దొరికితే అది అన్నట్లుగా కొని తాగేస్తున్నారు. మామూలుగానే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అందులోనూ ఈ బ్రాండ్ల వ్యవహారం చూస్తే క్వాలిటీ దారుణంగా ఉంటుందని అర్థమవుతోంది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో పేరుమోసిన మద్యం బ్రాండ్లన్నీ పక్కకు వెళ్లిపోయాయి.
బీర్లతో పాటు విస్కీ, బ్రాందీ, రమ్.. ఇలా అన్ని రకాల మద్యాల్లోనూ లోకల్ బ్రాండ్లు వచ్చేశాయి. అధికార పార్టీ నాయకులే తక్కువ ఖర్చుతో మద్యం తయారు చేసి.. వాటికి ఇష్టమొచ్చిన బ్రాండ్ల పేర్లు తగిలించి.. మద్యం దుకాణాల్లోకి తెస్తున్నారని.. వీటి ద్వారా భారీగా ఆదాయం దండుకుంటున్నారని.. వైన్ షాపులకు కూడా కమీషన్ దండిగా వస్తుండటంతో వాళ్లు కూడా వీటినే అమ్ముతున్నారని.. ఐతే వీటితో మందు బాబుల ఆరోగ్యాలు మరింతగా గుల్లవడం ఖాయమని అంటున్నారు. కానీ మద్యపానం అన్నదే హానికరం కావడంతో ఇలాంటి వాటిపై ప్రశ్నించేదెవరు? పోరాడేదెవరు? మందుబాబులు అభ్యంతరం వ్యక్తం చేసినా ఎవరు పట్టించుకుంటారు?
This post was last modified on May 5, 2020 6:03 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…