వాటర్ బాటిల్ను తలపించే సీసా.. అందులో ముదురు గోధుమ వర్ణంలో ద్రావణం.. దాన్ని చూస్తే సూపర్ మార్కెట్లలో స్టాండ్స్ మీద కనిపించే నువ్వుల నూనెలా అనిపిస్తుంది. కానీ దాని మీద లోగో చూస్తే మాత్రం షాకవుతాం. ‘స్పై హెచ్డీ విస్కీ’ అని రాసి ఉంది దాని మీద. 750 మిల్లీలీటర్ల పరిమాణం.. అంటే మందు బాబుల లెక్కల్లో ‘ఫుల్’ అన్నమాట. ధర 430 రూపాయలు.
అలాగే ‘ఆంధ్రా గోల్డ్’ పేరుతో మరో విస్కీ బ్రాండు. 180 మిల్లీ లీటర్ల పరిమాణంతో ఉన్న దాని ధర రూ.120. ఇప్పటిదాకా కనీ వినీ ఎరుగని బ్రాండ్లు ఇవి. కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి ఊరూ పేరు లేని బ్రాండ్లు మరెన్నో. నిన్న ఆంధ్రాలో వైన్ షాపులు రీఓపెన్ చేసిన సందర్భంగా కనిపించిన దృశ్యాలివి. ఆ బ్రాండ్లేంటో.. వాటిని ఎక్కడ తయారు చేశారో.. వాటి క్వాలిటీ ఏంటో తెలియక షాక్ తింటుున్నారు జనం.
ఐతే మందు దొరక్క పిచ్చెక్కిపోతున్న వాళ్లకు మాత్రం బ్రాండ్లతో పని లేదు. ఏది దొరికితే అది అన్నట్లుగా కొని తాగేస్తున్నారు. మామూలుగానే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అందులోనూ ఈ బ్రాండ్ల వ్యవహారం చూస్తే క్వాలిటీ దారుణంగా ఉంటుందని అర్థమవుతోంది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో పేరుమోసిన మద్యం బ్రాండ్లన్నీ పక్కకు వెళ్లిపోయాయి.
బీర్లతో పాటు విస్కీ, బ్రాందీ, రమ్.. ఇలా అన్ని రకాల మద్యాల్లోనూ లోకల్ బ్రాండ్లు వచ్చేశాయి. అధికార పార్టీ నాయకులే తక్కువ ఖర్చుతో మద్యం తయారు చేసి.. వాటికి ఇష్టమొచ్చిన బ్రాండ్ల పేర్లు తగిలించి.. మద్యం దుకాణాల్లోకి తెస్తున్నారని.. వీటి ద్వారా భారీగా ఆదాయం దండుకుంటున్నారని.. వైన్ షాపులకు కూడా కమీషన్ దండిగా వస్తుండటంతో వాళ్లు కూడా వీటినే అమ్ముతున్నారని.. ఐతే వీటితో మందు బాబుల ఆరోగ్యాలు మరింతగా గుల్లవడం ఖాయమని అంటున్నారు. కానీ మద్యపానం అన్నదే హానికరం కావడంతో ఇలాంటి వాటిపై ప్రశ్నించేదెవరు? పోరాడేదెవరు? మందుబాబులు అభ్యంతరం వ్యక్తం చేసినా ఎవరు పట్టించుకుంటారు?
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన…