ఇటీవల ఇద్దరు ఫోక్ డ్యాన్సర్లకు సంబంధించిన వ్యక్తిగత వివాదం సోషల్ మీడియాలో, మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లయి బిడ్డ కూడా ఉన్న ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయికి.. మాధురి రాథోడ్ అనే అమ్మాయికి మధ్య సంబంధం గురించి పెద్ద గొడవే నడిచింది. వీళ్లిద్దరూ కలిసి ఉండగా పట్టుకున్న ఈశ్వర్ సాయి భార్య.. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలోకి వదలడంతో హాట్ టాపిక్గా మారింది.
తర్వాత ఇందులో భర్త తప్పేమీ లేదని ఈశ్వర్ సాయి భార్య మాట్లాడితే.. తర్వాత ఈశ్వర్ తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పాడు. మరోవైపేమో.. ఈశ్వర్ సాయి మీద మాధురి రాథోడ్ కేసు పెట్టడం సంచలనం రేపింది. తర్వాత ఈ వ్యవహారం మీద ఏ అప్డేట్స్ లేవు.
ఐతే ఇప్పుడు మాధురి ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్త కలకలం రేపుతోంది. ఈశ్వర్ సాయి మీద తాను ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపానికి గురై మాధురి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక గదిలోకి వెళ్లి మాధురి ఫ్యాన్కు ఉరి వేసుకోగా.. డోర్ పగలగొట్టి ఆమెను కుటుంబ సభ్యులు కాపాడారట. ఈ విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్లుగా మాధురి ఆరోపిస్తోంది.
దీనికి తోడు తన ఫిర్యాదును అనుసరించి పోలీసులు ఈశ్వర్ సాయిని అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందట. ఈశ్వర్ సాయిని తప్పించే దిశగా నార్సింగి పోలీసులు పయత్నిస్తున్నట్లు ఆమె ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక.. వాళ్లిద్దరూ కలిసి.. విడివిడిగా చేసిన పాటలు యూట్యూబ్లో మార్మోగిపోతుండడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates