రవితేజతో మిగతా దర్శకులు ఫెయిలవుతోన్న టైమ్లో డాన్ శీను, బలుపు చిత్రాలతో గోపిచంద్ మలినేని వరుస విజయాలు సాధించాడు. అయితే దర్శకుడిగా అతడి స్థాయిని పెంచేంతగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. కానీ ఈ సంక్రాంతికి వచ్చిన ‘క్రాక్’తో రవితేజతో హ్యాట్రిక్ కంప్లీట్ చేసాడు. అందులోను రవితేజ మార్కెట్ పూర్తిగా పడిపోయిన దశలో గోపిచంద్ మలినేని ఈ హిట్టిచ్చాడు.
థియేటర్లకు మాస్ ప్రేక్షకులను రాబట్టడానికి కావాల్సిన మసాలా అంశాలను దట్టించి పారేసిన గోపిచంద్ మలినేని ఈ విజయంతో తనకు, రవితేజకే కాకుండా చిత్ర పరిశ్రమకు కూడా హెల్ప్ చేసాడు. ఈ విజయంతో అతడికి టాలీవుడ్లో డిమాండ్ పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు సినిమా తర్వాత మరో సినిమా వెతుక్కున్నట్టు వున్న గోపిచంద్ కోసం ఇప్పుడు నిర్మాతలు క్యూ కడుతున్నారు. టాప్ స్టార్లు బిజీగా వున్నా కానీ మిడ్ రేంజ్ హీరోలు అతడితో పని చేయడానికి ఉత్సాహ పడుతున్నారు.
మాస్ సినిమాలు తీసే వినాయక్, బోయపాటి శ్రీను ఇప్పుడు వెనుక పడడంతో నిఖార్సయిన మాస్ సినిమాలు తీసే దర్శకులకు కొరత వచ్చింది. గోపిచంద్ మలినేని కనుక క్రాక్లాగా మరోసారి బాక్సాఫీస్ కిటుకుని క్రాక్ చేసే ఇంకో హిట్టిస్తే ఇక అగ్ర హీరోలు కూడా అతడితో సినిమాకోసం రెడీ అయిపోవాల్సిందే.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…