కేవలం తెలుగువారి కోసమే ఒక ఓటీటీ ఉండాలన్న భిన్నమైన ఆలోచన చేసి.. ‘ఆహా’ పేరుతో కొత్త ఓటీటీ పెట్టి దాన్ని సూపర్ సక్సెస్ చేసిన ఘనత అల్లు అరవింద్దే. కరోనా ఈ ఓటీటీకి బాగానే కలిసొచ్చింది. లాక్ డౌన్ టైంలో జనాలు దీన్ని బాగా ఆదరించారు. ఐతే అదే సమయంలో ఓటీటీల హవా చూసి.. సినిమాలు, థియేటర్ల పరిస్థితి ఏమవుతుందో అన్న చర్చ నడిచింది. జనాలు వెబ్ సిరీస్లకు, ఇంటర్నేషనల్ కంటెంట్కు బాగా అలవాటు పడిపోయిన నేపథ్యంలో లోకల్ సినిమాల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఐతే సినిమాకు ఇప్పుడొచ్చిన ఢోకా ఏమీ లేదని తేల్చేశారు ‘ఆహా’ అధిపతి అల్లు అరవింద్.
‘అల వైకుంఠపురములో’ రీయూనియన్ వేడుకలో ఈ విషయమై ఆయనొక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘‘లాక్ డౌన్ టైంలో అందరూ ఓటీటీలకు అలవాటు పడిపోయి.. సినిమా చచ్చిపోతుందని శాడిస్టిగ్గా మాట్లాడారు. కానీ ఆహా ఓటీటీ ఓనర్గా చెబుతున్నా. అన్నింటికంటే సినిమానే గొప్పది. సినిమా అనేది తల్లి లాంటిది. ఓటీటీలు దాని పిల్లలు. కాబట్టి ఏది వచ్చినా సినిమా తట్టుకుని నిలబడుతుంది. సినిమాను మించింది ఏదీ లేదు’’ అని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.
ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాను ఒక వజ్రంగా పేర్కొన్న అరవింద్.. ఈ సినిమా త్రివిక్రమ్ మాయ అని చెప్పాడు. కరోనా టైంలో జనాలు ఈ సినిమా చూసి ఎంతో ఉపశమనం పొందారని.. థియేటర్లలో అద్భుత విజయం సాధించాక నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ వాళ్లు ఈ చిత్రాన్ని మరింతగా ప్రమోట్ చేసి తమ ఓటీటీల ద్వారా జనాల్లోకి మరింతగా తీసుకెళ్లారని.. మామూలుగా ఓటీటీల్లో ఒక సినిమాను చూసే స్థాయి కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఈ చిత్రాన్ని జనాలు చూశారని అరవింద్ అన్నారు.
మరోవైపు పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ.. ఆమెకు బాలీవుడ్లో మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని విన్నానని.. ఆమె తెలుగు వాళ్లను మరిచిపోవద్దని అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా ఇక్కడే ఒక తెలుగబ్బాయిని చేసుకుంటే ఆమె ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటుందని నమ్ముతానని ఆయన చమత్కరించడం విశేషం.
This post was last modified on January 12, 2021 2:03 pm
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…