Movie News

అల్లు అరవింద్ మాట: ఓటీటీ ఓనర్‌గా చెబుతున్నా..

కేవలం తెలుగువారి కోసమే ఒక ఓటీటీ ఉండాలన్న భిన్నమైన ఆలోచన చేసి.. ‘ఆహా’ పేరుతో కొత్త ఓటీటీ పెట్టి దాన్ని సూపర్ సక్సెస్ చేసిన ఘనత అల్లు అరవింద్‌దే. కరోనా ఈ ఓటీటీకి బాగానే కలిసొచ్చింది. లాక్ డౌన్ టైంలో జనాలు దీన్ని బాగా ఆదరించారు. ఐతే అదే సమయంలో ఓటీటీల హవా చూసి.. సినిమాలు, థియేటర్ల పరిస్థితి ఏమవుతుందో అన్న చర్చ నడిచింది. జనాలు వెబ్ సిరీస్‌లకు, ఇంటర్నేషనల్ కంటెంట్‌కు బాగా అలవాటు పడిపోయిన నేపథ్యంలో లోకల్ సినిమాల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఐతే సినిమాకు ఇప్పుడొచ్చిన ఢోకా ఏమీ లేదని తేల్చేశారు ‘ఆహా’ అధిపతి అల్లు అరవింద్.

‘అల వైకుంఠపురములో’ రీయూనియన్ వేడుకలో ఈ విషయమై ఆయనొక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘‘లాక్ డౌన్ టైంలో అందరూ ఓటీటీలకు అలవాటు పడిపోయి.. సినిమా చచ్చిపోతుందని శాడిస్టిగ్గా మాట్లాడారు. కానీ ఆహా ఓటీటీ ఓనర్‌గా చెబుతున్నా. అన్నింటికంటే సినిమానే గొప్పది. సినిమా అనేది తల్లి లాంటిది. ఓటీటీలు దాని పిల్లలు. కాబట్టి ఏది వచ్చినా సినిమా తట్టుకుని నిలబడుతుంది. సినిమాను మించింది ఏదీ లేదు’’ అని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.

ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాను ఒక వజ్రంగా పేర్కొన్న అరవింద్.. ఈ సినిమా త్రివిక్రమ్ మాయ అని చెప్పాడు. కరోనా టైంలో జనాలు ఈ సినిమా చూసి ఎంతో ఉపశమనం పొందారని.. థియేటర్లలో అద్భుత విజయం సాధించాక నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ వాళ్లు ఈ చిత్రాన్ని మరింతగా ప్రమోట్ చేసి తమ ఓటీటీల ద్వారా జనాల్లోకి మరింతగా తీసుకెళ్లారని.. మామూలుగా ఓటీటీల్లో ఒక సినిమాను చూసే స్థాయి కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఈ చిత్రాన్ని జనాలు చూశారని అరవింద్ అన్నారు.

మరోవైపు పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ.. ఆమెకు బాలీవుడ్లో మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని విన్నానని.. ఆమె తెలుగు వాళ్లను మరిచిపోవద్దని అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా ఇక్కడే ఒక తెలుగబ్బాయిని చేసుకుంటే ఆమె ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటుందని నమ్ముతానని ఆయన చమత్కరించడం విశేషం.

This post was last modified on January 12, 2021 2:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

24 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

37 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

1 hour ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

4 hours ago