అవును టీడీపీ నుండి వైసీపీలో చేరిన పోతుల సునీత తన ఎంఎల్సీ స్ధానాన్ని తిరిగి సాదించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంఎల్సీగా ఉన్న పోతుల సునీత పార్టీతో పాటు తన పదవికి కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఎంఎల్ఏ కోటాలో ఎంపికైన పోతులకు పార్టీలో చేరేటపుడు జగన్మోహన్ రెడ్డి ఏమి హామీ ఇచ్చారో ఎవరికీ తెలీదు అప్పుడు. అయితే ఆమె రాజీనామా ఆమోదం పొందగానే ఎన్నికల కమీషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈనెల 28వ తేదీన జరగబోయే ఎన్నికలో మళ్ళీ పోతులే నామినేషన్ దాఖలు చేశారు. అంటే వైసీపీ తరపున అభ్యర్ధిగా పోతుల సునీతను జగన్ ఎంపిక చేశారు. దాంతో టీడీపీ నుండి వచ్చేసే సమయంలో రాజీనామా చేసిన పదవిని పోతుల వైసీపీలో చేరగానే మళ్ళీ అందుకుంటున్నారు. తాజాగా పోతుల ఎంపికతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఒక నేత పక్కకుపోయినట్లే అయిపోయింది. లేకపోతే ఈమె కూడా చీరాల నియోజకవర్గం మీదే కన్నేశారు.
ఇప్పుడు పోతులకు ఎంఎల్సీ దక్కినట్లే గతంలో మాణిక్యవరప్రసాద్ కూడా దక్కించుకున్నారు. అప్పట్లో టీడీపీ ఎంఎల్సీగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా పార్టీకి, పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయితే రాజీనామా ఆమోదం పొందిన తర్వాత జరిగిన ఎన్నికలో జగన్ మళ్ళీ ఆ స్ధానాన్ని డొక్కాకే కేటాయించారు. అంటే రాజీనామాలు చేసి వచ్చినా తమ స్ధానం మళ్ళీ తమకు దక్కుతుందనే భరోసా నేతల్లో పెరుగుతోందని అర్ధమవుతోంది.
This post was last modified on January 12, 2021 2:14 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…