Political News

మొత్తానికి పోతుల సాదించుకుంది

అవును టీడీపీ నుండి వైసీపీలో చేరిన పోతుల సునీత తన ఎంఎల్సీ స్ధానాన్ని తిరిగి సాదించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంఎల్సీగా ఉన్న పోతుల సునీత పార్టీతో పాటు తన పదవికి కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఎంఎల్ఏ కోటాలో ఎంపికైన పోతులకు పార్టీలో చేరేటపుడు జగన్మోహన్ రెడ్డి ఏమి హామీ ఇచ్చారో ఎవరికీ తెలీదు అప్పుడు. అయితే ఆమె రాజీనామా ఆమోదం పొందగానే ఎన్నికల కమీషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈనెల 28వ తేదీన జరగబోయే ఎన్నికలో మళ్ళీ పోతులే నామినేషన్ దాఖలు చేశారు. అంటే వైసీపీ తరపున అభ్యర్ధిగా పోతుల సునీతను జగన్ ఎంపిక చేశారు. దాంతో టీడీపీ నుండి వచ్చేసే సమయంలో రాజీనామా చేసిన పదవిని పోతుల వైసీపీలో చేరగానే మళ్ళీ అందుకుంటున్నారు. తాజాగా పోతుల ఎంపికతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఒక నేత పక్కకుపోయినట్లే అయిపోయింది. లేకపోతే ఈమె కూడా చీరాల నియోజకవర్గం మీదే కన్నేశారు.

ఇప్పుడు పోతులకు ఎంఎల్సీ దక్కినట్లే గతంలో మాణిక్యవరప్రసాద్ కూడా దక్కించుకున్నారు. అప్పట్లో టీడీపీ ఎంఎల్సీగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా పార్టీకి, పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయితే రాజీనామా ఆమోదం పొందిన తర్వాత జరిగిన ఎన్నికలో జగన్ మళ్ళీ ఆ స్ధానాన్ని డొక్కాకే కేటాయించారు. అంటే రాజీనామాలు చేసి వచ్చినా తమ స్ధానం మళ్ళీ తమకు దక్కుతుందనే భరోసా నేతల్లో పెరుగుతోందని అర్ధమవుతోంది.

This post was last modified on January 12, 2021 2:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దీదీను ఓ రేంజ్‌లో టెన్ష‌న్ పెట్టేస్తున్న బీజేపీ!

ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గ‌త మూడు సార్లుగా ఇక్క‌డ అధికారంలో ఉన్న దీదీ..…

2 hours ago

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

4 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

6 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

7 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

7 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

10 hours ago