Political News

మొత్తానికి పోతుల సాదించుకుంది

అవును టీడీపీ నుండి వైసీపీలో చేరిన పోతుల సునీత తన ఎంఎల్సీ స్ధానాన్ని తిరిగి సాదించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంఎల్సీగా ఉన్న పోతుల సునీత పార్టీతో పాటు తన పదవికి కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఎంఎల్ఏ కోటాలో ఎంపికైన పోతులకు పార్టీలో చేరేటపుడు జగన్మోహన్ రెడ్డి ఏమి హామీ ఇచ్చారో ఎవరికీ తెలీదు అప్పుడు. అయితే ఆమె రాజీనామా ఆమోదం పొందగానే ఎన్నికల కమీషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈనెల 28వ తేదీన జరగబోయే ఎన్నికలో మళ్ళీ పోతులే నామినేషన్ దాఖలు చేశారు. అంటే వైసీపీ తరపున అభ్యర్ధిగా పోతుల సునీతను జగన్ ఎంపిక చేశారు. దాంతో టీడీపీ నుండి వచ్చేసే సమయంలో రాజీనామా చేసిన పదవిని పోతుల వైసీపీలో చేరగానే మళ్ళీ అందుకుంటున్నారు. తాజాగా పోతుల ఎంపికతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఒక నేత పక్కకుపోయినట్లే అయిపోయింది. లేకపోతే ఈమె కూడా చీరాల నియోజకవర్గం మీదే కన్నేశారు.

ఇప్పుడు పోతులకు ఎంఎల్సీ దక్కినట్లే గతంలో మాణిక్యవరప్రసాద్ కూడా దక్కించుకున్నారు. అప్పట్లో టీడీపీ ఎంఎల్సీగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా పార్టీకి, పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయితే రాజీనామా ఆమోదం పొందిన తర్వాత జరిగిన ఎన్నికలో జగన్ మళ్ళీ ఆ స్ధానాన్ని డొక్కాకే కేటాయించారు. అంటే రాజీనామాలు చేసి వచ్చినా తమ స్ధానం మళ్ళీ తమకు దక్కుతుందనే భరోసా నేతల్లో పెరుగుతోందని అర్ధమవుతోంది.

This post was last modified on January 12, 2021 2:14 pm

Share

Recent Posts

రకుల్ సినిమాల్లోకి వచ్చింది కారు కోసమే

కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు.…

52 seconds ago

హెచ్చరికలతో సరిపెడితే ఎలా బాబు గారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైఖ‌రి.. పార్టీ నాయ‌కులకు బాగా క‌లిసి వ‌స్తోంద‌న్న‌వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికి రెండు సంవ‌త్స‌రాలుగా చంద్ర‌బాబు.. త‌మ్ముళ్ల‌కు…

45 minutes ago

పార్టీ సమస్యలు పట్టించుకోండి సీఎం సార్

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…

3 hours ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

4 hours ago

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

9 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

11 hours ago