అవును టీడీపీ నుండి వైసీపీలో చేరిన పోతుల సునీత తన ఎంఎల్సీ స్ధానాన్ని తిరిగి సాదించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంఎల్సీగా ఉన్న పోతుల సునీత పార్టీతో పాటు తన పదవికి కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఎంఎల్ఏ కోటాలో ఎంపికైన పోతులకు పార్టీలో చేరేటపుడు జగన్మోహన్ రెడ్డి ఏమి హామీ ఇచ్చారో ఎవరికీ తెలీదు అప్పుడు. అయితే ఆమె రాజీనామా ఆమోదం పొందగానే ఎన్నికల కమీషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈనెల 28వ తేదీన జరగబోయే ఎన్నికలో మళ్ళీ పోతులే నామినేషన్ దాఖలు చేశారు. అంటే వైసీపీ తరపున అభ్యర్ధిగా పోతుల సునీతను జగన్ ఎంపిక చేశారు. దాంతో టీడీపీ నుండి వచ్చేసే సమయంలో రాజీనామా చేసిన పదవిని పోతుల వైసీపీలో చేరగానే మళ్ళీ అందుకుంటున్నారు. తాజాగా పోతుల ఎంపికతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఒక నేత పక్కకుపోయినట్లే అయిపోయింది. లేకపోతే ఈమె కూడా చీరాల నియోజకవర్గం మీదే కన్నేశారు.
ఇప్పుడు పోతులకు ఎంఎల్సీ దక్కినట్లే గతంలో మాణిక్యవరప్రసాద్ కూడా దక్కించుకున్నారు. అప్పట్లో టీడీపీ ఎంఎల్సీగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా పార్టీకి, పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయితే రాజీనామా ఆమోదం పొందిన తర్వాత జరిగిన ఎన్నికలో జగన్ మళ్ళీ ఆ స్ధానాన్ని డొక్కాకే కేటాయించారు. అంటే రాజీనామాలు చేసి వచ్చినా తమ స్ధానం మళ్ళీ తమకు దక్కుతుందనే భరోసా నేతల్లో పెరుగుతోందని అర్ధమవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…