రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. అభిమానులు ఎప్పటిలాగే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఎలాగూ వారణాసి విడుదల ఏప్రిల్ లోనే కాబట్టి ఈసారి దాని టీజర్ తో రచ్చ చేద్దామనుకున్నారు. కానీ దాని స్థానంలో కేవలం రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేస్తారని తెలియడంతో కొంత నిరాశపడ్డారు. ఎందుకంటే నెక్స్ట్ బర్త్ డేకల్లా వారణాసి రిలీజ్ అయిపోయి ఉంటుంది. అందుకే రాజమౌళి ఈసారే ఏదైనా కానుక ఇవ్వాలని కోరుకున్నారు.
అదింక జరిగే పని కాదని అర్థమైపోవడంతో ఫ్యాన్స్ ఫోకస్ ఇప్పుడు దూకుడు రీ రిలీజ్ మీదకు వెళ్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ ఎంటర్ టైనర్ 2011లో ఎలాంటి రికార్డులు సృష్టించిందో ఎవరూ మర్చిపోలేదు. ముఖ్యంగా మహేష్ కామెడీ టైమింగ్, బ్రహ్మానందం క్యారెక్టర్, ఏంఎస్ నారాయణ విశ్వరూపం, వీటికి తోడు తమన్ సంగీతం కలిసి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మ్రోగించాయి. అందుకే రీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఎదురు చూస్తూ వచ్చారు.
ఎలాగూ వారణాసి నుంచి స్పెషల్ వీడియో ఏదీ లేదు కాబట్టి దూకుడు తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. బుకింగ్స్ బాగానే ఉన్నాయి. హైదరాబాద్ ఉదయం షోలు దాదాపు ఫుల్ అయిపోగా ఏపీ తెలంగాణ బిసి సెంటర్స్ లోనూ ఆక్యుపెన్సీలు బాగున్నాయి. గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో అతడు భారీ ఎత్తున పునః విడుదల చేశారు. అయితే ఊహించని విధంగా ఖలేజా, పోకిరి, మురారి స్థాయిలో అతడుకి రెస్పాన్స్ కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మరి ఇప్పుడు దూకుడు ఏం చేస్తుందో చూడాలి. ఇక వారణాసి సంగతికి వస్తే రేపటి పోస్టర్లలో మరోసారి విడుదల తేదీని నొక్కి వక్కాణించబోతున్నారు. వాయిదాలు వేసుకునే ఉద్దేశంలో రాజమౌళి అసలు లేరట. ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం జరుగుతుండటంతో పోస్ట్ పోన్ గురించి ఫ్యాన్స్ టెన్షన్ పడనక్కర్లేదు. ఏప్రిల్ 7 ఈ విజువల్ గ్రాండియర్ ని చూడటం ఖాయం. ఆలోగా లెక్కలేనన్ని అప్డేట్స్, ప్రమోషన్లతో జనవరి నుంచి జనాన్ని ఊపేయడానికి వారణాసి టీమ్ రెడీ అయ్యిందట.
This post was last modified on August 8, 2026 5:03 pm
తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు, వర్గ విబేధాలతో పార్టీ జాతీయ నాయకత్వం సైతం తలలు పట్టుకుంటోంది. ఆ పార్టీ జాతీయ…
బాల్టిమోర్, మేరీల్యాండ్: జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 19వ అమెరికన్ తెలుగు…
డిఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షల వివాదం విజయవాడ రాజకీయాల్లో అగ్గి రాజేశాయి. గురువారం జరిగిన…
తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్న మాజీ ఎంపీ, మాజీ సీఎం కేసీఆర్ తనయ కవిత.. ఇప్పుడు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెద్ద రిలీఫ్ ఫీలవుతున్నాడు. వరస డిజాస్టర్లతో ఏకంగా కెరీర్ నే రిస్క్ లో పెట్టుకున్న…
కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది మెగా డీఎస్సీ-2025ను నిర్వ హించి 16 వేల…