బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక విచిత్రమైన క్లాష్ మొదలైంది. ఒకే రోజు, వేర్వేరు మేకర్స్ నుంచి ఒకే టైటిల్తో రెండు సినిమాలు అఫీషియల్గా అనౌన్స్ అయ్యాయి. ఆ పేరే రాంబోలా. దర్శకులు, నిర్మాతలు వేరైనా రెండింటి సోల్ ఒక్కటే. హిందూ సనాతన ధర్మంలో ఎంతో విశిష్ట స్థానం ఉన్న గోస్వామి తులసీదాస్ బయోపిక్ తెరకెక్కించేందుకు రెండు టీమ్స్ ఒకేసారి రంగంలోకి దిగాయి.
ఇందులో ఒక రాంబోలాను విశాల్ చతుర్వేది డైరెక్ట్ చేస్తుండగా, ప్రముఖ ప్రొడ్యూసర్ మహవీర్ జైన్ నిర్మిస్తున్నారు. సరిగ్గా అదే టైమ్లో సీనియర్ డైరెక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది సైతం అదే పేరుతో తన ప్రాజెక్ట్ను బయటపెట్టారు. గతంలో సామ్రాట్ పృథ్వీరాజ్, మొహల్లా అస్సీ లాంటి చిత్రాలు తీసిన ఈయన సినిమాకు మధు మంతెన నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇద్దరు పేరున్న దర్శకులు ఒకేసారి తులసీదాస్ కథపై పడటంతో బీటౌన్లో పెద్ద చర్చే నడుస్తోంది.
ఈ రెండు టీమ్స్ రాంబోలా పేరునే ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. పురాణాల ప్రకారం గోస్వామి తులసీదాస్కు చిన్నతనంలో ఉన్న ముద్దుపేరు రాంబోలా. పుట్టగానే ఆయన రాముడి నామం పలకడంతో ఆ పేరు పెట్టారట. దీంతో ఈ బయోపిక్కు ఇంతకంటే పర్ఫెక్ట్ టైటిల్ ఉండదని ఇద్దరు డైరెక్టర్లు ఫిక్స్ అయ్యారు. కానీ టైటిల్ రిజిస్ట్రేషన్ అసలు రైట్స్ ఎవరి చేతిలో ఉన్నాయి, చివరకు ఎవరు పేరు మార్చుకుంటారనేది అసలు సస్పెన్స్.
కథ ఒక్కటే అయినా ట్రీట్మెంట్ కచ్చితంగా వేరుగా ఉండే ఛాన్స్ ఉంది. తులసీదాస్ జీవితంలో బాల్యపు కష్టాలు, సన్యాస ప్రయాణం, రామచరితమానస్ రచన లాంటి ఎన్నో కోణాలున్నాయి. విశాల్ తనదైన కమర్షియల్ యాంగిల్లో కథను నడిపిస్తారా లేక చంద్రప్రకాశ్ ద్వివేది తన స్టైల్లో సీరియస్ పీరియాడిక్ డ్రామాగా తీర్చిదిద్దుతారా అనేది చూడాలి. నటీనటులు ఎవరనేది తేలితే ప్రాజెక్ట్ల రేంజ్ అర్థమవుతుంది.
ప్రస్తుతానికి రెండు పోస్టర్లు మాత్రమే బయటకు వచ్చాయి. మెయిన్ లీడ్ చేసేది ఎవరు, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ముందుగా ఎవరు సెట్స్ పైకి వెళ్తారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.
This post was last modified on September 19, 2026 8:07 am
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…