తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు చేసే విశ్వక్సేన్ను పెళ్ళి కోసం తపన పడే ఒక మామూలు కుర్రాడిగా చూపించిన ఈ చిత్రం యువతకే కాదు, కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. ఈ చిత్రంలో అతడికి జోడీగా రుక్సర్ ధిల్లాన్, రితిక నాయక్ నటించారు. ఐతే ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ రిలీజయ్యే వరకు అందులో ఇంకో హీరోయిన్ ఉన్నట్లే తెలియదు. రుక్సర్నే కథానాయిక అనుకున్నారు. ప్రమోషన్లలో ఆమే కనిపించింది.
సినిమా చూస్తున్నపుడు కూడా మొదట రితిక హీరోయిన్ అనిపించదు. సహాయ పాత్రలా ఉంటుంది. కానీ క్రమంగా ఆ పాత్రే హైలైట్ అవుతూ వెళ్తుంది. సినిమా పూర్తయ్యేసరికి ఆ పాత్రకు భలే ఎలివేషన్ ఉంటుంది. రిలీజ్ తర్వాత రితికకు మంచి పేరు కూడా వచ్చింది.
ప్రమోషన్లలో కనిపించనివ్వకుండా, ప్రోమోల్లో కూడా హైలైట్ కాకుండా ఈ హీరోయిన్ని ఇలా దాచి ఉంచడం బాగా వర్కవుట్ అయింది. ఐతే టీం వ్యూహాత్మకంగా చేసిన ఈ పని తనను బాధ పెట్టినట్లు రితిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను తెలుగులో నటించిన తొలి చిత్రం ప్రమోషన్లలో పాల్గొనకపోవడం పట్ల తాను చాలా బాధపడ్డానని ఆమె చెప్పింది.
‘‘అశోక వనంలో అర్జున కళ్యాణం రిలీజ్ టైంలో టీం అంతా ప్రమోషన్లలో పాల్గొంది. అందులో నేను లేకపోవడం చాలా బాధగా అనిపించింది. టీం వ్యూహాత్మకంగా ఆ పని చేసి ఉండొచ్చు. కానీ నాకు లేక లేక ఒక ఛాన్స్ వచ్చి ఒక పాత్ర చేస్తే.. నా మొదటి సినిమా ప్రమోషన్లలో నేను లేకపోవడంతో తట్టుకోలేకపోయాను. నా ఫ్రెండుకు ఫోన్ చేసి దీని గురించి బాధపడ్డాను. కానీ సినిమా రిలీజయ్యాక అందరూ నా గురించి మాట్లాడుకున్నారు. మంచి పేరొచ్చింది. అప్పుడే టీం నన్ను దాచి ఉంచడం నా మంచికే అని అర్థమైంది. కొన్నిసార్లు ఓర్పుతో ఉండడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందని తెలుసుకున్నాను’’ అని రితిక చెప్పింది.
ఈ సినిమా తర్వాత రితికకు మంచి మంచి అవకాశాలే వచ్చాయి. తేజ సజ్జతో కలిసి చేసిన ‘మిరాయ్’ పెద్ద హిట్ కాగా.. ఇప్పుడు వరుణ్ తేజ్కు జోడీగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on July 30, 2026 7:08 pm
శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. అప్పలరాజును…
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…
ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో…
వైసీపీ అధినేత జగన్ ఏలక్ష్యంతో అయితే.. శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారో.. ఆ లక్ష్యం నెరవేరకుండానే వెనుదిరిగే పరిస్థితి ఏర్పడింది. దీనికి…