పేరుకు మలయాళ హీరోయినే కానీ.. అనుపమ పరమేశ్వరన్ తెలుగులోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది, ఇక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. మొదట్లో ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఉండేది కానీ.. రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్ లాంటి చిత్రాలతో ఆమె ఇమేజ్ మారిపోయింది. ఈ చిత్రాల్లో లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లు చేసి తన ఇమేజ్ను మార్చేసుకుంది అనుపమ.
ఐతే ఈ మధ్య సినిమాలు కొంచె తగ్గి అంతగా లైమ్ లైట్లో ఉండట్లేదు అనుపమ. వ్యక్తిగత జీవితంలో బిజీ అవ్వడం వల్లే ఈ గ్యాప్ అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె ‘బైసన్’ సినిమాలో నటించేటపుడు తన కోస్టార్ ధ్రువ్ విక్రమ్ ప్రేమలో పడ్డట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తనకు బ్రేకప్ అయిందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. తన సోషల్ మీడియా పోస్టులు ఆ రకమైన ఆలోచన రేకెత్తిస్తున్నాయి.
తాజాగా ఇన్స్టాగ్రామ్లో తన ఫొటోలు షేర్ చేస్తూ అనుపమ పెట్టిన క్రిప్టిక్ కామెంట్ చదివితే అనుమానాలు కలగక మానదు. ఫొటోలు డంప్ చేసినందుకు సారీ చెబుతూ.. ఈ పోస్టు పెట్టే ముందు ఎవరి అనుమతి అడగాల్సిన అవసరం లేకపోయిందని, వీటికి బ్యాగ్రౌండ్ సాంగ్ సెలక్షన్ కోసం, ఇంకెవరో క్యాప్షన్ పెడతారని ఎదురు చూడడం లాంటివేమీ లేవని ఆమె కామెంట్ చేసింది. ఇది అనుపమ క్యాజువల్గా పెట్టిన పోస్టులా కనిపించడం లేదు.
బ్రేకప్ తర్వాత తనకు ఫ్రీడమ్ వచ్చిందన్న అర్థం వచ్చేలా ఆ కామెంట్ కనిపిస్తోంది. ధ్రువ్తో అనుపమ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి కానీ.. వాళ్లిద్దరూ ఎక్కువగా కలిసి కనిపించడమైతే జరగలేదు. ఈ మధ్య మరీచిక, లాక్ డౌన్ లాంటి చిత్రాలతో పలకరించిన అనుపమ.. ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘భోగి’ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు ధ్రువ్ విక్రమ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక ద్విభాషా చిత్రం చేస్తున్నాడు.
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలై సిరీస్ ను…
తమ సినిమా పెద్ద హిట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చెప్పుకోవడం మామూలే. ఇలా ఎవరైనా చెప్పుకుంటుంటే అదేమీ…
ఒకప్పుడు జాతీయ అవార్డులు ప్రకటిస్తుంటే.. తెలుగు సినిమాకు ప్రాతినిధ్యం దక్కితే ఆశ్చర్యపోయేవాళ్లం. మన సినిమాలకు ఏదైనా విభాగంలో జాతీయ అవార్డు…
పార్టీలో కార్యకర్తల స్థాయిలో ఉన్నవారు.. పార్టీ పెద్దలతో ఫొటోలు అంటే.. ఎంతగా ఎగబడతారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా జాతీయ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కబోతున్న ఆర్సి 17 నవంబర్ నుంచి షూటింగ్ కు…
తెలుగు నేల రాజకీయాల్లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ కేక్…