వచ్చే వారం విడుదల కాబోతున్న రామాయణ ట్రైలర్ నిన్న ముంబైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు. ఎవరూ సెల్ ఫోన్లలో రికార్డు చేయకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరు రహస్యంగా షూట్ చేయడంతో అది కాస్తా బయటికి వచ్చేసి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్లారిటీ లేకపోయినా కంటెంట్ ఎలా ఉందో స్పష్టంగా అర్ధమయ్యే స్థాయిలో కవర్ చేయడంతో దాదాపుగా అంతా రివీలయ్యిందని చెప్పాలి.
ఇలా అయితే 24 తేదీ వరకు వీటిని నిలువరించడం కష్టం. టాక్ ప్రకారం చూసుకుంటే రామాయణ టీజర్ మీద వచ్చిన నెగటివ్ కామెంట్స్ మోతాదు ట్రైలర్ తర్వాత తగ్గే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు నితేశ్ తివారి కీలకమైన విజువల్స్ రివీల్ చేయడం ద్వారా తెలివైన ఎత్తుగడ వేశారు. రన్బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ ని పూర్తిగా రివీల్ చేయడంతో పాటు ఇతర ముఖ్యమైన క్యారెక్టర్లను ఒకటి రెండు షాట్ల రూపంలో పరిచయం చేశారు. ఓవరాల్ చక్కగా ఉందని టాక్.
కాకపోతే నాలుగు వేల కోట్ల బడ్జెట్ స్థాయిలో ఇది అనిపిస్తుందా అంటే అనుమానమేనని చెప్పాలి. ఎందుకంటే నిర్మాత నమిత్ మల్హోత్రా పలు ఇంటర్వ్యూలలో చాలా భారీ నెంబర్ చెప్పేశారు. దీంతో అంచనాలు హాలీవుడ్ మూవీ స్థాయిలో ఉన్నాయి. వాటిని నిలబెట్టుకోవడం పెద్ద ఛాలెంజ్. అందులోనూ రామాయణ లాంటి వందలసార్లు చూసిన కథతో ఆడియన్స్ ని కన్విన్స్ చేయడం అంత సులభంగా ఉండదు. చిన్న విమర్శ కూడా పెద్ద డ్యామేజ్ చేస్తుంది.
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ బిజినెస్ వ్యవహారాలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. తెలుగు హక్కులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఆదిపురుష్ టైంలో వచ్చిన నెగటివిటీని పూర్తిగా పోగొట్టేలా రామాయణ ఉంటుందని బాలీవుడ్ మీడియా వర్గాలు నమ్ముతున్నాయి. అదే నిజమైతే వసూళ్ల వర్షం ఖాయమే. 3డి, ఐమాక్స్ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ ఎపిక్ వండర్ లో సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ ఇతర ముఖ్య తారాగణం.
This post was last modified on July 19, 2026 1:52 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…