పెద్ద హీరోల కొడుకులు ఆటోమేటిగ్గా హీరోలు అయిపోతుంటారు. ఇందుకు ఇండియాలో ఏ ఫిలిం ఇండస్ట్రీ మినహాయింపు కాదు. ముఖ్యంగా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఈ ఒరవడి బాగా ఉంది. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ను సైతం మించిపోయి నంబర్ వన్ హీరోగా ఎదిగిన విజయ్.. తన కొడుకు జేసన్ విజయ్ను కూడా హీరోయే చేస్తాడని అంతా అనుకున్నారు.
కానీ విజయ్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిపోగా.. అదే సమయంలో అందరికీ పెద్ద షాకిస్తూ జేసన్ దర్శకుడిగా రంగప్రవేశం చేశాడు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో సిగ్మా అనే సినిమాను రూపొందించాడు. హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నేరుగా దర్శకుడిగా అరంగేట్రం చేశాడంటే.. జేసన్ ఆ బాటలోనే సాగిపోతాడని, నటనలోకి రాడేమో అని విజయ్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ తండ్రి బాటలో తానూ హీరో అవుతానని జేసన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విజయ్ అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది. దర్శకులుగా ప్రయాణం మొదలుపెట్టి తర్వాత హీరోలైన ప్రదీస్ రంగనాథన్, అభిషాన్ జీవింత్ (టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్)ల బాటలో తాను కూడా నటనలోకి రావాలనుకుంటున్నట్లు జేసన్ తెలిపాడు.
తాను భవిష్యత్తులో నటుడిగా, దర్శకుడిగా ద్విపాత్రాభినయం చేయాలనుకుంటున్నట్లు.. రెంటినీ బ్యాలెన్స్ చేసుకోవాలని భావిస్తున్నట్లు జేసన్ తెలిపాడు. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన సిగ్మా ఈ నెల 31నే విడుదల కావాల్సింది. ఐతే ఈ నెల 23న విజయ్ చివరి చిత్రం జననాయగన్ రిలీజ్ కానున్న నేపథ్యంలో దాంతో క్లాష్ వద్దని తన సినిమాను వచ్చే నెలకు వాయిదా వేసుకున్నాడు జేసన్. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
This post was last modified on July 17, 2026 7:10 am
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…