నిన్న విడుదలైన ఫౌజీ ఫస్ట్ లుక్ మీద చర్చలు, మీమ్స్ మొదలైపోయాయి. రెగ్యులర్ హీరో గెటప్ కాకుండా ప్రభాస్ ని షర్ట్ లెస్ గా చూపిస్తూ ఒక యుద్ధ వాతావరణంలో దర్శకుడు హను రాఘవపూడి ప్రెజెంట్ చేసిన తీరుకి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇప్పుడు మాకు స్పిరిట్ కన్నా ముందు కిక్ ఇచ్చే సినిమా ఇదేనంటూ సంతోషపడుతున్నారు. బాలీవుడ్ వర్గాల్లోనూ ఈ పోస్టర్ మీద డిబేట్లు కనిపిస్తున్నాయి. అన్నింటిలోనూ ఉన్న కామన్ పాయింట్ ప్రభాస్ ఒంటి మీద ఉన్న జంధ్యం.
ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టే ప్రభాస్ ఇందులో బ్రాహ్మణుడిగా నటిస్తున్నాడన్న పాయింట్ కు క్లారిటీ వచ్చేసింది. అయితే సైన్యంలో ఎందుకు చేరాడు, సుభాష్ చంద్ర బోస్ తో ఎందుకు జట్టు కట్టాడనే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. మూవీ లవర్స్ గతంలో హీరోలు బ్రాహ్మిన్స్ గా నటించిన సినిమాలు తవ్వుతున్నారు. అదుర్స్ జూనియర్ ఎన్టీఆర్, డీజే దువ్వాడ జగన్నాధం అల్లు అర్జున్, జెంటిల్ మెన్ అర్జున్, ముగ్గురు మొనగాళ్లు చిరంజీవి ఇలా చాలా లిస్టు ఉంది.
అయితే ఫౌజీ వీటన్నింటికి చాలా భిన్నం. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కాదు. 1932లో జరిగిన స్వాతంత్ర పోరాటం నేపథ్యంలో జరుగుతుంది. ఒక అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతమూ ఉంటుంది. ఇవన్నీ ఫౌజీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాయని టీమ్ నమ్మకం. వచ్చే వారంలో టీజర్ లాంచ్ చేసే ప్లానింగ్ ఉందట. మూడు నిమిషాల వీడియో దాదాపు సిద్ధంగా ఉందని అంతర్గత వర్గాల సమాచారం.
డిసెంబర్ 3 ఇంకా దూరంలో ఉన్నట్టు అనిపిస్తున్నప్పటికీ ఫౌజీ బృందానికి ప్రయాణం ముళ్ల మీద జరుగుతోంది. ఎందుకంటే ఇంకా ప్రభాస్ వర్కింగ్ డేట్లే ముప్పైకి పైగా కావాలట. సో పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ వగైరాలకు అదనపు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వాయిదా వేయడానికి లేదు. రాజా సాబ్ లాగా డిసెంబర్ ప్రకటించి తర్వాత సంక్రాంతికి వెళ్లిన పొరపాటు ఫౌజీ టీమ్ చేయడం లేదు. రికార్డులు బద్దలవ్వాలంటే సోలో రిలీజ్ దక్కాల్సిందే.
పెద్ద హీరోల కొడుకులు ఆటోమేటిగ్గా హీరోలు అయిపోతుంటారు. ఇందుకు ఇండియాలో ఏ ఫిలిం ఇండస్ట్రీ మినహాయింపు కాదు. ముఖ్యంగా తెలుగు,…
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య నిత్యం వాగ్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి…
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే... ఇతర ప్రాంతాల గురించి అటుంచితే... ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…