బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మొదట 80వ దశకంలో రీనాదత్తాను పెళ్లాడిన ఆమిర్.. 2002లో ఆమె నుంచి విడిపోయాడు. తర్వాత 2005లో కిరణ్ రావుతో ఆయనకు వివాహం జరిగింది. ఆమె నుంచి 2021లో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్ అనే బెంగళూరు మహిళతో ఆయనకు వివాహం జరిగింది.
ఈ పెళ్లిలో రీనా, కిరణ్లతో పాటు వారితో ఆమిర్ ఖాన్ కు కలిగిన పిల్లలు కూడా పాల్గొన్నారు. ఐతే ముస్లిం అయిన ఆమిర్.. హిందూ మహిళలను పెళ్లి చేసుకుని వదిలేయడం అలవాటుగా మార్చుకున్నాడని.. ఇది లవ్ జిహాదే అని ఆయన మీద సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్ర బీజేపీ మంత్రి నితీశ్ రాణే ఇదే కామెంట్ చేశారు. దీనిపై ఆమిర్ తాజాగా స్పందించాడు.
తన వివాహాలు ఎంతమాత్రం లవ్ జిహాద్లో భాగం కాదని ఆమిర్ అన్నాడు. తన భార్యల్లో ఎవ్వరూ ఇస్లాం మతంలోకి మారలేదని ఆయన స్పష్టం చేశారు. రీనా, కిరణ్ ఇద్దరూ పెళ్లి తర్వాత కూడా హిందూ మతంలోనే కొనసాగారన్నాడు. ఇక గౌరీ గురించి స్పందిస్తూ.. ఆమె అసలు హిందువే కాదని, క్రిస్టియన్ అని ఆమిర్ వెల్లడించాడు. ఆమె అసలు మతాచారాలను పాటించదని అన్నాడు.
తనది ఎంతో విశాల దృక్పథం ఉన్న కుటుంబం అని.. తన ఇద్దరు సోదరీమణులు హిందువులను పెళ్లి చేసుకున్నారని.. తన కుమార్తె కూడా హిందువునే పెళ్లాడిందని.. తన కజిన్ మన్సూర్ క్రిస్టియన్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడని ఆమిర్ తెలిపాడు. ఇదిలా ఉండగా.. గౌరీ ఇస్లాం మతంలోకి మారలేదు కాబట్టి ఆమిర్ మూడో పెళ్లి చెల్లదంటూ ముస్లిం పెద్దలు ఫత్వా జారీ చేయడం గమనార్హం. దీనిపై ఆమిర్ ఏమీ స్పందించలేదు.
This post was last modified on July 15, 2026 11:08 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…