లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్ పాత్ర కోసం అఖిల్ చాలా కష్టపడి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడని చెబుతూ.. ఈ సినిమాలో కొత్త అఖిల్ కనిపిస్తాడన్నాడు. అఖిల్ను ఒక మామూలు పల్లెటూరి కుర్రాడిగా చూపించడమే పెద్ద ఛాలెంజ్ అని.. తన ఒంటి రంగు, ఓవరాల్ లుక్ ప్రకారం చూస్తే అలాంటి పాత్రలో ఒప్పించడం కష్టమని ఆయనన్నాడు.
అఖిల్ చూడ్డానికి చాలా తెల్లగా కనిపిస్తాడని.. బాగా డబ్బున్నోడిలా అనిపిస్తాడని.. లెనిన్ సినిమాలో మాత్రం ఆ ఫీలింగ్ రాకుండా చూశామని… తన ఒంటి రంగుతో పాటు అన్నీ మార్చేశామని.. ఈ పాత్రకు అతను సూటబుల్ అని ప్రేక్షకులతో అనిపిస్తామని నాగవంశీ అన్నాడు.
లెనిన్ సినిమా చూశాక నాగవంశీ మాటలతో ఏకీభవించాల్సిందే అనిపిస్తుంది. లెనిన్ పాత్రలో ఒదిగిపోవడానికి అఖిల్ ఎంత కష్టపడ్డాడో తెర మీద ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తూనే ఉంటుంది. అతను రిచ్ కిడ్ అని, ముట్టుకుంటే మాసిపోతాడు అనే ఫీలింగ్ ఎక్కడా రాదు. నాగార్జున అన్నట్లు అఖిల్ ఇప్పటిదాకా చేసింది అర్బన్ సినిమాలే చేసిన నేపథ్యంలో మహాభారత నేపథ్యంలో సాగే విలేజ్ డ్రామాలో అఖిల్ ను ఊహించుకోవడం కష్టమే.
ఐతే ప్రోమోల్లోనే అఖిల్ సరికొత్త అవతారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. తన ట్రాన్స్ఫర్మేషన్ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు సినిమాలో ఓవరాల్ గా తన గెటప్, బాడీ లాంగ్వేజ్, పెర్ఫార్మెన్స్ అన్ని కూడా బాగా కుదిరాయి అనిపించింది. నటనలోనూ పరిణతి కనిపించింది.
ఈ పాత్రకు అతను సూట్ కాలేదు అనిపించడమే ఈ సినిమా విషయంలో అఖిల్ సాధించిన అతి పెద్ద విజయం. నటుడిగా అదరగొట్టేశాడు అని చెప్పలేం కానీ డిసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సినిమా కమర్షియల్ గా బాగానే ఆడేలా కనిపిస్తుండటంతో అక్కినేని కుర్రాడి నిరీక్షణకు తెర పడే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on July 11, 2026 8:11 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…