Movie News

‘సట్లజ్’ నిషేధం… అసలేం జరిగింది

థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో వచ్చిన మూవీ కేవలం నలభై ఎనిమిది గంటల నిడివిలోనే నిషేదానికి గురి కావడం చాలా అరుదు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం ‘సట్లజ్’ ఇదే పరిస్థితిని ఎదురుకుంటోంది. ఇటీవలే ఎలాంటి హడావిడి లేకుండా డిజిటల్ లోకి వచ్చిన సట్లజ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న టైంలో హఠాత్తుగా మాయం కావడం మూవీ లవర్స్ ని కలవరపెడుతోంది.

ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావాలంటే కొంచెం లోతుల్లోకి వెళ్ళాలి. 1980 ముఖ్యంగా ఇందిరాగాంధీ హత్య తర్వాత పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ కొన్ని వేల మందిని పోలీసులు చంపేశారు. వాళ్ళలో మిలిటెంట్లు, సామాన్య పౌరులు ఉన్నారు. అనుమానం వస్తే చాలు విచారణ లేకుండా ప్రాణాలు తీయడం పోలీసుల హక్కుగా మారిపోయింది. ఈ దమనకాండ మీద పోరాడిన వ్యక్తి జస్వంత్ సింగ్ ఖాల్రా. ఈయన సామజిక హక్కుల కార్యకర్తగా మారిన బ్యాంక్ ఉద్యోగి .

1995 వరకు జస్వంత్ సింగ్ ఎన్నో నిజాలను వెలికి తీసి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు. అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆయన్ని కిడ్నాప్ చేసి హత్య చేయడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతదేహం దొరక్కుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. శవం లేకపోవడంతో కేసు ముందుకు కదల్లేదు. అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి మేరకు సిబిఐ సంస్థ రంగంలోకి దిగాక అసలు దోషులు పట్టుబడ్డారు. 2007లో వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

ఈ మొత్తం సంఘటనలను సట్లజ్ సినిమాలో తెరకెక్కించారు దర్శకుడు హనీ ట్రెహాన్. ముందు అనుకున్న టైటిల్ పంజాబ్ 95. సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడంతో సట్లజ్ గా మార్చారు. చాలా కట్స్ చెప్పడంతో టీమ్ మూడు సంవత్సరాలు న్యాయ పోరాటం చేసింది. పరిష్కారం దొరక్కపోవడంతో ఓటిటి బాట పట్టింది. అక్కడా బ్రేకులు పడ్డాయి. హక్కులు పొందిన జీ5 సంస్థ ఇండియాలో మాత్రమే స్టీమింగ్ ఆపేసింది. మిగిలిన దేశాల్లో ఉన్న భారతీయులు చూసేయొచ్చు. 

This post was last modified on July 6, 2026 10:46 am

Share

Recent Posts

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

17 minutes ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

1 hour ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

2 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

2 hours ago

సూర్య పాత్రలో షాకింగ్ ట్విస్టుందా?

తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…

2 hours ago

విజయవాడ మేయర్ రేసుకు పోటాపోటీ

విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…

3 hours ago