సెన్సార్ బోర్డు ఈ మధ్య సినిమాలకు ఎంత పెద్ద అడ్డంకిగా మారుతోందో తెలిసిందే. మరీ అన్యాయంగా కట్స్ చెబుతుండడం.. మామూలు సన్నివేశాలకు కూడా ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేస్తుండడం తీవ్ర వివాదాలు రేపుతోంది. ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్రయోజనం చేకూర్చే సినిమాలైతే ఎంత వివాదాస్పదంగా ఉన్నా క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారని.. వేరే సినిమాలను మాత్రం కావాలని టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి.
ఇక తెలుగులో అయితే చిన్న సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉంటోంది. ఏమాత్రం అసభ్యత లేని ‘దీవానా’ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడంపై చిత్ర బృందం లబోదిబోమంది. కొన్ని సినిమాలకు రిలీజ్ దగ్గర టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించింది సెన్సార్ బోర్డు. ఇలా దాని చుట్టూ వివాదాలకైతే లెక్కే లేదు. ఇలాంటి టైంలో ఒక చిత్రం సెన్సార్ బోర్డు దెబ్బకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఆ చిత్రమే.. సత్లుజ్.
పంజాబ్కు చెందిన మానవ హక్కుల నేత జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా ‘సత్లుజ్’ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ముందు ‘పంజాబ్ 95’ పేరుతో రూపొందించాడు దర్శకుడు హనీ టెహ్రాన్. పంజాబీ నటుడు దిల్జిత్ దోసాంజ్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. పంజాబ్లో 25 వేల మందిని అన్యాయంగా పోలీసులు చంపిన విషయాన్ని తన పరిశోధన ద్వారా వెలుగులోకి తెచ్చిన జస్వంత్ సింగ్.. 1995లో హత్యకు గురయ్యాడు.
అతణ్ని ఆరుగురు పోలీసులే ఎత్తుకెళ్లి చంపేశారని అభియోగాలు ఎదుర్కొన్నారు. ఎన్నో వివాదాలతో ముడిపడ్డ సినిమా కావడంతో దీనికి సెన్సార్ బోర్డు అభ్యంతరాలు చెప్పింది. మూడేళ్లుగా సెన్సార్ బోర్డుతో పోరాడి పోరాడి అలసిపోయింది చిత్ర బృందం. సెన్సార్ బోర్డు ఏకంగా 127 కట్స్ చెప్పిందట. అన్ని కట్స్ చేస్తే సినిమానే పోతుందని భావించిన చిత్ర బృందం.. చివరికి ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయొద్దని నిర్ణయించుకుంది. ‘సత్లుజ్’గా టైటిల్ మార్చి తాజాగా జీ5లో స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది. దీనికి మంచి టాక్ వస్తోంది. తప్పక చూడాల్సిన సినిమాగా చూసిన వాళ్లు సోసల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
పొరపాట్లు అంటే ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు. కానీ అదే పనిగా రిపీట్ చేస్తే దాన్ని తప్పు అంటారు. బాలీవుడ్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై చాలాకాలంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి…
లెజెండరీ డైరెక్టర్ ఈవీవీ సత్య నారాయణ తన ఇద్దరు కొడుకుల విషయంలో చేసిన ప్లానింగ్ వేరు. కానీ జరిగింది వేరు. ఇద్దరిలో పెద్ద కొడుకు…
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థలకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇదేసమయంలో ప్రభుత్వంపైనా…
సమంత మా ఇంటి బంగారం రిలీజై ఘనవిజయం సాధించాక ఆమె తల్లి కాబోతున్న వార్తను రివీల్ చేసిన సంగతి తెలిసిందే.…
రాజకీయాల్లో ఇక అంతా అయిపోయింది.. అనుకున్న పరిస్థితి నుంచి ఉత్తుంగతరంగంగా పైకెగసిన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజకీయాల్లోకి…