సెన్సార్ బోర్డు ఈ మధ్య సినిమాలకు ఎంత పెద్ద అడ్డంకిగా మారుతోందో తెలిసిందే. మరీ అన్యాయంగా కట్స్ చెబుతుండడం.. మామూలు సన్నివేశాలకు కూడా ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేస్తుండడం తీవ్ర వివాదాలు రేపుతోంది. ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్రయోజనం చేకూర్చే సినిమాలైతే ఎంత వివాదాస్పదంగా ఉన్నా క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారని.. వేరే సినిమాలను మాత్రం కావాలని టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి.
ఇక తెలుగులో అయితే చిన్న సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉంటోంది. ఏమాత్రం అసభ్యత లేని ‘దీవానా’ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడంపై చిత్ర బృందం లబోదిబోమంది. కొన్ని సినిమాలకు రిలీజ్ దగ్గర టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించింది సెన్సార్ బోర్డు. ఇలా దాని చుట్టూ వివాదాలకైతే లెక్కే లేదు. ఇలాంటి టైంలో ఒక చిత్రం సెన్సార్ బోర్డు దెబ్బకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఆ చిత్రమే.. సత్లుజ్.
పంజాబ్కు చెందిన మానవ హక్కుల నేత జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా ‘సత్లుజ్’ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ముందు ‘పంజాబ్ 95’ పేరుతో రూపొందించాడు దర్శకుడు హనీ టెహ్రాన్. పంజాబీ నటుడు దిల్జిత్ దోసాంజ్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. పంజాబ్లో 25 వేల మందిని అన్యాయంగా పోలీసులు చంపిన విషయాన్ని తన పరిశోధన ద్వారా వెలుగులోకి తెచ్చిన జస్వంత్ సింగ్.. 1995లో హత్యకు గురయ్యాడు.
అతణ్ని ఆరుగురు పోలీసులే ఎత్తుకెళ్లి చంపేశారని అభియోగాలు ఎదుర్కొన్నారు. ఎన్నో వివాదాలతో ముడిపడ్డ సినిమా కావడంతో దీనికి సెన్సార్ బోర్డు అభ్యంతరాలు చెప్పింది. మూడేళ్లుగా సెన్సార్ బోర్డుతో పోరాడి పోరాడి అలసిపోయింది చిత్ర బృందం. సెన్సార్ బోర్డు ఏకంగా 127 కట్స్ చెప్పిందట. అన్ని కట్స్ చేస్తే సినిమానే పోతుందని భావించిన చిత్ర బృందం.. చివరికి ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయొద్దని నిర్ణయించుకుంది. ‘సత్లుజ్’గా టైటిల్ మార్చి తాజాగా జీ5లో స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది. దీనికి మంచి టాక్ వస్తోంది. తప్పక చూడాల్సిన సినిమాగా చూసిన వాళ్లు సోసల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
This post was last modified on July 4, 2026 6:15 pm
ఓటిటిలు ఇంత విస్తృతంగా పెరిగిన తర్వాత ఏదైనా హిట్ సినిమాని రీమేక్ చేయాలంటే సంవత్సరాలు కాకుండా నెలల్లోనే పూర్తి చేయాలి.…
దర్శకుడు కొరటాల శివ టైం అంత బాగా నడుస్తున్నట్టు లేదు. ఆచార్య మానని గాయం చేసింది. డిజాస్టర్లు అందరికీ వస్తాయి…
మల్లారెడ్డి విద్యాసంస్థలను ఏపీకి కూడా విస్తరించారు మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి. తిరుపతిలో మల్లారెడ్డి…
డబ్బు, బంగారం కోసం ఓ తల్లి తన మైనర్ కొడుకును హత్యలకు ప్రేరేపించిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట…
సూర్యకు ఈ ఏడాది బాగానే కలిసి వస్తోంది. ‘వీరభద్రుడు’ తర్వాత ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా మంచి రన్లో…
గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. వరుసగా హ్యాట్రిక్ కొట్టి అధికారంలో ఉన్న…