సెలబ్రెటీలు స్టేజ్ల మీద మాట్లాడేటపుడు.. ఇంటర్వ్యూలు ఇచ్చినపుడు ఏం మాట్లాడుతున్నామో కాస్త స్పృహతో ఉండడం ఎంతో అవసరం. ఈ సోషల్ మీడియాలో రోజుల్లో హద్దులు దాటి మాట్లాడితే.. అవి పెద్ద వివాదంగా మారి వారి సినిమాలనే దెబ్బ తీస్తుంటాయి. చిన్న చిన్న కామెంట్లను కూడా పట్టుకుని హేట్ క్యాంపైనింగ్స్ ఎలా నడుపుతారో తెలిసిందే. ఒకసారి మాట తూలాక వివరణ ఇచ్చుకున్నా కూడా పెద్దగా ఫలితం ఉండదు.
టాలీవుడ్ యువ దర్శకుడు వెంకటేష్ మహా విషయంలో ఇదే జరుగుతోంది. తన కొత్త చిత్రం ‘రావు బహదూర్’ను సోషల్ మీడియాలో ఒక వర్గం గట్టిగా టార్గెట్ చేస్తోంది. ఈ శుక్రవారం రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొందరేమో తెలుగులో వచ్చిన గొప్ప చిత్రాల్లో ఒకటని కొనియాడుతున్నారు. తెలుగులో ఇలాంటి సినిమా రావడం అరుదని.. మన ఆడియన్స్ ఇలాంటి వినూత్న చిత్రాలను తప్పక ఆదరించాలని అంటున్నారు. అదే సమయంలో ఇంకొందరు మాత్రం సినిమా పరమ బోరింగ్ అని.. చిన్న పాయింట్ పట్టుకుని విపరీతంగా సాగదీశారని తిట్టిపోస్తున్నారు.
ఐతే రెండో వర్గంలో కొందరు సినిమా జస్ట్ బాగాలేదని ఊరుకోవట్లేదు. వెంకటేష్ మహా పాత కామెంట్లను ఉటంకిస్తూ ఈ సినిమాను టార్గెట్ చేస్తున్నారు. కొన్నేళ్ల ముందు కొందరు యువ దర్శకులతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూల్లో కమర్షియల్ సినిమాల్లో సన్నివేశాల గురించి చాలా తేలికగా మాట్లాడాడు మహా. ముఖ్యంగా కేజీఎఫ్, సలార్ చిత్రాలను అతను కించపరిచేలా మాట్లాడాడన్నది ఆరోపణ. ఈ కామెంట్లు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి.
ఒక్క సినిమా దర్శకుడు కమర్షియల్ సినిమాల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడ్డం ఏంటంటూ అతడి తీరును దుయ్యబట్టారు. ఐతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మహా ఆ కామెంట్ల గురించి వివరణ ఇచ్చాడు. తాను విమర్శించింది కమర్షియల్ సినిమాలను కాదని, అల్ట్రా వయొలెంట్ మూవీస్ గురించి అని అన్నాడు. కానీ తన కామెంట్లు వింటే ఆ అభిప్రాయం కలగదు.
ఆ కామెంట్లను గుర్తు పెట్టుకుని.. ఇప్పుడు ‘రావు బహదూర్’కు లింక్ చేసి విమర్శలు గుప్పిస్తోంది ఒక వర్గం. చిన్న పాయింట్ను లాగి లాగి, ఇంత బోరింగ్ సినిమా తీసిన దర్శకుడు.. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలను మాత్రం తప్పుబడతాడని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు మహా తన సినిమాతో ప్రేక్షకులను ఏమేర మెప్పిస్తాడో.. ఎంతమేర వసూళ్లు రాబడతాడో తేలిపోతుందని అంటున్నారు.
This post was last modified on July 4, 2026 5:21 pm
భారతీయులకు విదేశీ పౌరసత్వాలు దక్కడం కొత్తేమీ కాదు. ముందు ఇండియాలోనే పుట్టి పెరిగి.. తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాక…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాల్లో ప్రయత్నించినా.. విద్యార్థుల ఆందోళనలను నిలువరించలేకపోతోంది. ఇప్పటికే బల ప్రయోగం చేయడంతో ఇది తీవ్ర వివాదానికి…
ఉప ముఖ్యమంత్రి పవన్ కు ఇది పెద్ద పరీక్షే. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక ముందడుగు వేస్తున్న ఆ…
ఒక దశలో ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’, ‘ఎఫ్-2’ లాంటి విజయాలతో మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కెరీర్ మంచి…