టికెట్ల ధరలు అందుబాటులో ఉండడం ఎంత కీలకమో ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉన్నా.. పెద్ద సినిమాల మేకర్స్ తీరు మారదు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందని.. ఓటీటీల ప్రభావం గట్టిగా పడుతోందని.. టికెట్ల ధరలు, పాప్ కార్న్ రేట్లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వాళ్లే స్టేజ్ల మీద అంటుంటారు. తీరా చూస్తే మళ్లీ వాళ్లే ఉన్న రేట్ల మీద అదనంగా వడ్డిస్తారు.
ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూడాలని ఆశించే కొంచెం పెద్ద సినిమా వచ్చిందంటే చాలు.. వాటికి రేట్లు పెంచేస్తారు. ‘పెద్ది’ విషయంలోనూ అదే జరిగింది. తెలంగాణలో కోర్టు కేసుల తలనొప్పులున్నా.. కొంత కాలంగా ప్రభుత్వం కూడా రేట్ల పెంపు విషయంలో అంత సానుకూలంగా లేకపోయినా.. పట్టుబట్టి ఈ చిత్రానికి రేట్లు పెంచుకున్నారు. తెలంగాణ మల్టీప్లెక్సుల్లో ఆల్రెడీ టికెట్ల ధరలు ఎక్కువ అన్న అభిప్రాయం ఉంటే.. వాటి మీద అదనంగా రేట్లు పెంచడం పట్ల ప్రేక్షకుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదు.
‘పెద్ది’కి లాంగ్ రన్ రాలేదంటే అధిక టికెట్ ధరలు ఒక కారణం అనడంలో సందేహం లేదు. ఈ సినిమా ఆడుతుండగానే సమంత సినిమా ‘మా ఇంటి బంగారం’ అందుబాటు ధరలతో థియేటర్లలోకి రావడం, మంచి టాక్ తెచ్చుకోవడంతో ఫ్యామిలీస్ అన్నీ అటు వైపు మళ్లాయి. ‘పెద్ది’ రన్ అర్ధంతరంగా ఆగిపోయింది.
ఐతే ‘పెద్ది’ నామమాత్రంగా నడుస్తున్న ఈ టైంలో ఆ చిత్రానికి తెలంగాణలో టికెట్ల ధరలు తగ్గించారు. సింగిల్ స్క్రీన్ల రేట్లలో గరిష్ఠ ధరను రూ.105గా పెట్టారు. కానీ ఇదేదో రెండో వీకెండ్ తర్వాతే తగ్గించి ఉంటే సినిమాకు కలిసొచ్చేది. రన్ అంతా అయిపోయాక ప్రేక్షకులకు ఏదో వరం ఇస్తున్నట్లు ఇప్పుడు రేట్లు తగ్గించడం మరీ విడ్డూరం.
ఎంత పెద్ద సినిమా అయినా, ఎలాంటి టాక్ తెచ్చుకున్నా సరే.. రెండో వీకెండ్ను మించి సినిమా నిలబడడం లేదంటే అధిక టికెట్ ధరలు ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ప్రేక్షకులు కొత్త సినిమా రిలీజైతే వీలైనంత త్వరగా థియేటర్లలో చూడాలనుకుంటారు. వాళ్లు చూడాలనుకున్నపుడు అధిక రేట్లు ఉంటున్నాయి. తర్వాత తగ్గిస్తున్నారు కానీ.. ఇంకొన్ని రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తుందిలే అని ఆడియన్స్ అప్పుడు కూడా థియేటర్లకు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ సైకిల్ ఇలాగే కొనసాగినంత కాలం.. పెద్ద సినిమాలకు ఆశించిన వసూళ్లు రావడం కష్టమే.
This post was last modified on July 3, 2026 8:05 am
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…