టికెట్ల ధరలు అందుబాటులో ఉండడం ఎంత కీలకమో ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉన్నా.. పెద్ద సినిమాల మేకర్స్ తీరు మారదు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందని.. ఓటీటీల ప్రభావం గట్టిగా పడుతోందని.. టికెట్ల ధరలు, పాప్ కార్న్ రేట్లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వాళ్లే స్టేజ్ల మీద అంటుంటారు. తీరా చూస్తే మళ్లీ వాళ్లే ఉన్న రేట్ల మీద అదనంగా వడ్డిస్తారు.
ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూడాలని ఆశించే కొంచెం పెద్ద సినిమా వచ్చిందంటే చాలు.. వాటికి రేట్లు పెంచేస్తారు. ‘పెద్ది’ విషయంలోనూ అదే జరిగింది. తెలంగాణలో కోర్టు కేసుల తలనొప్పులున్నా.. కొంత కాలంగా ప్రభుత్వం కూడా రేట్ల పెంపు విషయంలో అంత సానుకూలంగా లేకపోయినా.. పట్టుబట్టి ఈ చిత్రానికి రేట్లు పెంచుకున్నారు. తెలంగాణ మల్టీప్లెక్సుల్లో ఆల్రెడీ టికెట్ల ధరలు ఎక్కువ అన్న అభిప్రాయం ఉంటే.. వాటి మీద అదనంగా రేట్లు పెంచడం పట్ల ప్రేక్షకుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదు.
‘పెద్ది’కి లాంగ్ రన్ రాలేదంటే అధిక టికెట్ ధరలు ఒక కారణం అనడంలో సందేహం లేదు. ఈ సినిమా ఆడుతుండగానే సమంత సినిమా ‘మా ఇంటి బంగారం’ అందుబాటు ధరలతో థియేటర్లలోకి రావడం, మంచి టాక్ తెచ్చుకోవడంతో ఫ్యామిలీస్ అన్నీ అటు వైపు మళ్లాయి. ‘పెద్ది’ రన్ అర్ధంతరంగా ఆగిపోయింది.
ఐతే ‘పెద్ది’ నామమాత్రంగా నడుస్తున్న ఈ టైంలో ఆ చిత్రానికి తెలంగాణలో టికెట్ల ధరలు తగ్గించారు. సింగిల్ స్క్రీన్ల రేట్లలో గరిష్ఠ ధరను రూ.105గా పెట్టారు. కానీ ఇదేదో రెండో వీకెండ్ తర్వాతే తగ్గించి ఉంటే సినిమాకు కలిసొచ్చేది. రన్ అంతా అయిపోయాక ప్రేక్షకులకు ఏదో వరం ఇస్తున్నట్లు ఇప్పుడు రేట్లు తగ్గించడం మరీ విడ్డూరం.
ఎంత పెద్ద సినిమా అయినా, ఎలాంటి టాక్ తెచ్చుకున్నా సరే.. రెండో వీకెండ్ను మించి సినిమా నిలబడడం లేదంటే అధిక టికెట్ ధరలు ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ప్రేక్షకులు కొత్త సినిమా రిలీజైతే వీలైనంత త్వరగా థియేటర్లలో చూడాలనుకుంటారు. వాళ్లు చూడాలనుకున్నపుడు అధిక రేట్లు ఉంటున్నాయి. తర్వాత తగ్గిస్తున్నారు కానీ.. ఇంకొన్ని రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తుందిలే అని ఆడియన్స్ అప్పుడు కూడా థియేటర్లకు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ సైకిల్ ఇలాగే కొనసాగినంత కాలం.. పెద్ద సినిమాలకు ఆశించిన వసూళ్లు రావడం కష్టమే.
అయ్యగారు కంబ్యాక్ అంటూ అభిమానులే సరదాగా హాస్యమాడే అఖిల్ జూలై 10 లెనిన్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా…
జూన్ నెలలో ఊహించిన దానికన్నా చాలా పెద్ద హిట్టుగా నిలిచిన సమంత మా ఇంటి బంగారం కొన్నవాళ్లకు, డిస్ట్రిబ్యూట్ చేసినవాళ్లకు…
ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్లో ఎప్పుడైనా చూసుకునే అవకాశం ఉన్న పాత సినిమాలను మళ్లీ థియేటర్లకు వెళ్లి చూసేందుకు…
జూలై 1వ తేదీ వచ్చేసింది. ఈ రోజు మధ్యతరగతి ప్రజల బడ్జెట్పై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన ఆర్థిక మార్పులు…
వైసీపీ నేత, ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో…
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నానీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.…