వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం విడుదల తేదీకి అఫీషియల్ ముద్ర పడిపోయింది. అక్టోబర్ 2 రిలీజ్ చేయబోతున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది. మొదటి సారి ఇతర క్యాస్టింగ్ తో ఉన్న కొత్త పోస్టర్ ని అభిమానుల కోసం పంచుకుంది. హీరోయిన్ శ్రీనిధి శెట్టితో పెట్టు వెంకీ జంటకు పిల్లలుగా నటిస్తున్న ఇద్దరిని రివీల్ చేశారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాని హారికా హాసిని బ్యానర్ మీద తీస్తున్నారు.
దగ్గుబాటి అభిమానుల అనుమానాలకు ఇంతటితో చెక్ పడిపోయాయి. ఆ మధ్య వచ్చిన ఒక తమిళ హిట్ మూవీతో ఆదర్శ కుటుంబంకి కొన్ని పోలికలు ఉన్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. దీనికి టీమ్ స్పందించలేదు. టైటిల్ కింద్ ఏకె 47 అనే క్యాప్షన్, రక్తపు మరకలతో చివర్లో చిన్న టచింగ్ చూసి ఇలాంటి అనుమానం వచ్చిందో లేక ఇంకేదైనా ఉందేమో తెలియదు కానీ ఆ కారణంగా రీ షూట్ చేశారనే పుకార్లు కొన్ని రోజులు గట్టిగానే తిరిగింది. కానీ అవేవి నిజం కాదట.
దీని సంగతలా ఉంచితే సోలో హీరోగా వెంకటేష్ కు ఏడాదిన్నర గ్యాప్ వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఆయన ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించలేదు. మన శంకరవరప్రసాద్ గారులో క్యామియో కాబట్టి దాన్ని పూర్తి పరిగణనలోకి తీసుకోలేం. ఆదర్శ కుటుంబం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న కాంబో. నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి లాంటి బ్లాక్ బస్టర్స్ కు రచయితగా పని చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి వెంకటేష్ ని డైరెక్ట్ చేయడం ఇందులో ప్రధాన విశేషం.
ప్రస్తుతానికి ఆ తేదీకి ఎలాంటి పోటీ లేదు. ఎవరూ లాక్ చేసుకోలేదు. జైలర్ 2 అయితే దసరా లేదా దీపావళి అంటున్నారు కాబట్టి ఇబ్బందేం లేదు. ఆదర్శ కుటుంబం పేరు పాతగా అనిపిస్తున్నా ట్రీట్ మెంట్ మాత్రం జెన్ జీ స్టైల్ లో ఉంటుందట. ముందు తీసుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ని వద్దనుకుని మరీ తమన్ కు సంగీత బాధ్యతలు అప్పజెప్పారు కాబట్టి పాటల పరంగా కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఎలా ఉండబోతోందో.
హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం…
అదేంటో గానీ… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కు ఎటు వెళ్లినా విమర్శల జడివానే తప్పడం లేదు. సాధారణ…
ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు…
డ్రాగన్ విడుదల ఇంకా సంవత్సరం ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కాలం భారంగా గడిచిపోతోంది. ఒకవేళ వార్ 2 బ్లాక్…
అమరావతిలోని ఉండవల్లిలో వైసీపీ నాయకుల పర్యటన ఉద్రిక్తతంగా మారింది. ఆ పర్యటనను రాజధాని రైతులు, టీడీపీ వర్గాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.…
ప్రభాస్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సినిమా స్పిరిట్ కావొచ్చు కానీ దానికన్నా ముందే రాబోతున్న ఫౌజీని తక్కువంచనా…