టాలీవుడ్లో తాను ఎదుగుతూ తన కోసం పని చేసే వాళ్లందరినీ మంచి స్తాయికి తీసుకొచ్చిన కథానాయకుల్లో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడు. మారుతి, బన్నీ వాసు, ఎస్కేఎన్.. వీళ్లందరూ బన్నీ దగ్గర చిన్న స్థాయిలో ప్రయాణం మొదలుపెట్టిన వాళ్లే. వీరిలో మారుతి ఏకంగా ప్రభాస్తో సినిమా చేసే స్థాయి దర్శకుడయ్యాడు. బన్నీ వాసు గీతా ఆర్ట్స్-2 సంస్థను చాలా ఏళ్ల పాటు నడిపిస్తూ వచ్చారు.
ఇప్పుడు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నాడు. ఎస్కేఎన్ బేబీ సినిమాతో నిర్మాతగా సంచలనం రేపాడు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు వీరి బాటలో బన్నీ పీఆర్ టీం హెడ్ శరత్ చంద్ర కూడా గుర్తుకొస్తున్నాయి సిరీస్తో నిర్మాత అవతారం ఎత్తుతుఉన్నాడు. ఈ ఈవెంట్కు అతిథిగా హాజరైన ఎస్కేఎన్.. బన్నీ తమ జీవితాలను ఎలా మార్చేశాడో గుర్తు చేసుకున్నాడు.
బన్నీ పీఆర్ టీంలో చేరడానికి తమకు అప్పట్లో ఉన్న ఏకైక అర్హత మెగా ఫ్యాన్స్ కావడమే అని ఎస్కేఎన్ చెప్పాడు. తాము మెగా ఫ్యాన్స్ అనగానే పిలిచి తమకు ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించాడు ఎస్కేఎన్. ముందు తాను బన్నీ పీఆర్ టీంను నడిపించేవాడినని.. తర్వాత తాను పూర్తి స్థాయి నిర్మాతగా మారాలి అనుకున్నపుడు ఎంత స్ట్రెస్తో కూడుకున్న ఈ జాబ్ చేయడానికి సరైన వ్యక్తి ఎవరు అని చూస్తే శరత్ చంద్ర కనిపించాడని.. తన తర్వాత తన కంటే బాగా ఆ బాధ్యతలు చూశాడని ఎస్కేఎన్ వెల్లడించాడు.
పవన్ కళ్యాణ్ మీద అభిమానుల కోసం శరత్ ఒక వెబ్ సైట్ నడిపేవాడని.. ఆ స్థితి నుంచి ఇప్పుడు నిర్మాతగా మారే స్థాయికి వచ్చాడని ఎస్కేఎన్ చెప్పాడు. తన దగ్గర పని చేసేవాళ్లు ఎక్కడ మొదలుపెట్టారో అక్కడే ఉండిపోవాలని బన్నీ అనుకోడని.. అందరూ పెద్ద స్థాయికి వెళ్లాలని వారిని ప్రోత్సహించి తమ అందరినీ నిర్మాతల్ని చేశాడని ఎస్కేఎన్ అన్నాడు.
ప్రొడక్షన్ హౌస్ల నుంచి కొత్త నిర్మాతలు రావడం మామూలే కానీ.. ఒక హీరో టీం నుంచి ఇంతమంది నిర్మాతలుగా మారడం అరుదైన విషయమని, అదే బన్నీ స్పెషాలిటీ అని ఎస్కేఎన్ వ్యాఖ్యానించాడు. మరోవైపు శరత్ చంద్ర కూడా తన ఉన్నతికి బన్నీనే కారణం అంటూ.. పట్టుబట్టి తనను నిర్మాతను చేశాడని చెప్పుకొచ్చాడు.
తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెలుగులో ఎలాంటి ఫాలోయింగ్ ఉండేదో అందరికీ తెలిసిందే. ఆయన ఇక్కడి టాప్ స్టార్లతో నేరుగా…
ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ పేరు ఎలా మార్మోగిందో తెలిసిందే. మహా మహా బ్యాటర్లను వెనక్కి నెట్టి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆడుతున్న క్రికెట్ చివరి ఓవర్ కు వచ్చేసింది. బుక్ మై షోలో నిన్నటిదాకా…
తమిళ సినీ పరిశ్రమలో "స్క్రీన్ప్లే కింగ్"గా పేరొందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ మృతితో సినీ ప్రపంచం విషాదంలో…
వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేసమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా…
తెలుగులో కేవలం నటనకు పరిమితం కాకుండా.. రైటింగ్, మేకింగ్లోనూ భాగం అవుతూ తన సినిమాలను సక్సెస్ చేసుకునే హీరోల్లో నవీన్…