Movie News

భాగ్యరాజ్.. గుంటూరు అల్లుడేనండి..!

తమిళ సినీ పరిశ్రమలో “స్క్రీన్‌ప్లే కింగ్”గా పేరొందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ మృతితో సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. అయితే ఆయనకు తెలుగు రాష్ట్రాలతో, ముఖ్యంగా గుంటూరుతో ఉన్న అనుబంధం చాలామందికి తెలియని విశేషం. ప్రముఖ నటి పూర్ణిమ జయరామ్ గుంటూరుకు చెందిన కుటుంబానికి చెందినవారు కావడంతో, ఆమెను వివాహం చేసుకున్న తర్వాత భాగ్యరాజ్‌ను అభిమానులు ప్రేమగా “గుంటూరు అల్లుడు” అని పిలిచేవారు.

భాగ్యరాజ్ తొలి వివాహం 1981లో నటి ప్రవీణతో జరిగింది. అయితే ఆమె 1983లో అనారోగ్యంతో మృతి చెందారు. అనంతరం 1984 ఫిబ్రవరి 7న తనతో కలిసి ‘డార్లింగ్.. డార్లింగ్.. డార్లింగ్’ చిత్రంలో నటించిన పూర్ణిమ జయరామ్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పూర్ణిమ ‘మగమహారాజు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

గుంటూరుకు చెందిన కుటుంబంలోకి అల్లుడిగా అడుగుపెట్టిన భాగ్యరాజ్‌కు తెలుగు ప్రేక్షకులతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. తెలుగు సినీ వేడుకలు, అభిమానుల సమావేశాల్లో ఆయనను “గుంటూరు అల్లుడు” అని సంబోధించడం ఆనవాయితీగా మారింది. ఆయన కూడా తెలుగు అభిమానుల అభిమానాన్ని ఎంతో ఆప్యాయంగా స్వీకరించేవారు.

కుటుంబ కథా చిత్రాలకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన భాగ్యరాజ్, రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేశారు. ‘అంద 7 నాట్కళ్’ (తెలుగులో ‘రాధా కళ్యాణం’), ‘ముందనై ముడిచ్చు’ (తెలుగులో ‘మూడు ముళ్లు’) వంటి చిత్రాలు ఆయన సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచాయి. అంతేకాదు, అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆఖరి రాస్తా’, వెంకటేష్ నటించిన ‘సుందరకాండ’ చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించి విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

This post was last modified on June 27, 2026 2:41 pm

Share

Recent Posts

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

4 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

7 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

7 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

7 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

10 hours ago

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…

11 hours ago