విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం. ఇది అక్టోబర్ విడుదలకు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ కాగానే ప్రమోషన్లు మొదలుపెడతారు. రెండోది అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మొదలుపెట్టిన మల్టీస్టారర్. కళ్యాణ్ రామ్ మరో హీరో. కేవలం మూడు నెలల గ్యాప్ లోనే ఇవి థియేటర్లకు వచ్చేలా ఉన్నాయి. వీటి తర్వాత వెంకీ ఎవరికి కమిట్ మెంట్ ఇస్తారనేది సస్పెన్స్ గా ఉండిపోయింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వెంకటేష్ కోసం ఇద్దరు దర్శకులు ప్రయత్నిస్తున్నారు. మొదటి పేరు వశిష్ఠ. విశ్వంభర కోసం ఆల్రెడీ మూడు సంవత్సరాలు లాకైపోయాడు. రిలీజ్ ఎప్పుడు ఉంటుందో ఇంకా తేలనే లేదు. విఎఫెక్స్ నాగ్ అశ్విన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గౌర హరి చూస్తున్నారనే ప్రచారం జోరుగా ఉన్నా వాటికి కూడా స్పందన లేదు. చిరు రికమండేషన్ తోనే వశిష్ఠ వెంకీని కలిసినట్టుగా ఒక టాక్ ఉంది. అదే నిజమైతే ఈ ఫాంటసీ దర్శకుడికి మంచి బ్రేక్ దొరికినట్టే.
ఇక రెండో పేరు బాబీ కొల్లి. ప్రస్తుతం మెగాస్టార్ 158ని చకచకా పరుగులు పెట్టిస్తున్న ఈ దర్శకుడు సంక్రాంతి బరిలో దింపాలనే లక్ష్యంతో షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నాడు. తను కూడా వెంకీని కలిశారట. వీళ్ళ కలయికలో గతంలో వెంకీ మామ వచ్చింది. బ్లాక్ బస్టర్ కాదు కానీ డీసెంట్ గానే ఆడింది. నాగచైతన్య అందులో నిజ జీవితంలోలా మేనల్లుడిగా నటించాడు. ఆ బాండింగ్ తోనే బాబీ కొల్లి వెంకటేష్ ని కలిసినట్టుగా తెలిసింది. స్టోరీ లైన్ మాత్రమే డిస్కషన్ జరిగిందట.
ఇద్దరిలో ఎక్కువ అవకాశం వశిష్ఠకే ఉన్నట్టు సమాచారం, సురేష్ ప్రొడక్షన్స్, నల్లమలపు బుజ్జి సంయుక్త నిర్మాణంలో తెరకెక్కించేందుకు స్టేజి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా ఇవ్వాల్సి ఉంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఏకంగా ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న వెంకీ ఇప్పుడు స్పీడ్ పెంచుతున్నారు. వసిష్ఠ ఈసారి ఫాంటసీ జోలికి వెళ్లడం లేదంటున్నారు. యాక్షన్ టచ్ ఉన్న కమర్షియల్ ఎంటర్ టైనర్ వినిపించారని టాక్. అఫీషియలయ్యాక క్లారిటీ వస్తుంది.
This post was last modified on June 26, 2026 12:57 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…