శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను ఎదురుకోవాల్సి వచ్చింది. ప్రమోషన్ల సమయంలో తను చెప్పుకున్న బాధలు, సినిమాలో నటన గురించి సోషల్ మీడియాలో కాసింత ట్రోలింగ్ కూడా జరిగింది. విజయ్ దేవరకొండ జోడిగా నటించిన ఖుషి దానికన్నా కాస్త మెరుగ్గా ఆడినప్పటికీ ఫైనల్ రిజల్ట్ అంతంత మాత్రమే. ఆ తర్వాత గ్యాప్ వచ్చేసింది.
మధ్యలో సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ ఫ్లాప్ కావడం ఇంకో ఎదురుదెబ్బ. ఎందుకంటే దాని కోసం చాలా కష్టపడింది. అయినా ఫలితం దక్కలేదు. వ్యక్తిగత జీవితం కొంత టార్గెట్ కావడం, పెళ్లికి ముందు రాజ్ నిడిమోరుతో ప్రేమ వ్యవహారం మీడియాకు ఎక్కడం లాంటివి ఇబ్బంది పెట్టాయి. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకున్న బేస్ ని ఇవేవి తగ్గించలేకపోయాయి. దానికి సాక్ష్యంగా మా ఇంటి బంగారం కలెక్షన్లు నిలుస్తున్నాయి. ఫస్ట్ వీక్ లోనే అర సెంచరీ గ్రాస్ దాటేసింది సామ్.
మాములుగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేటప్పుడు నిర్మాతలకు చాలా రిస్క్ ఉంటుంది. కేవలం హీరోయిన్ ఇమేజ్ మీద డబ్బులు వస్తాయనే గ్యారెంటీ ఉండదు. అనుష్క ఎంత ఇమేజ్ సంపాదించుకున్నా రుద్రమదేవి యావరేజ్ ముద్రతో గట్టెక్కితే ఘాటీ చాలా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. నవీన్ పోలిశెట్టి ఉండటం వల్ల మరో మూవీ సేఫ్ అయ్యింది. లుక్స్ పరంగా అనుష్క ఎదురుకున్న సమస్య వల్ల బయట కనిపించడం కూడా మానేసింది. కానీ సమంత అలా కాదు. నిత్యం పబ్లిక్ లైఫ్ లో కనిపిస్తూనే ఉంటుంది.
తల్లి కాబోతున్న శుభ తరుణంలో ఇప్పటికిప్పుడు సమంత కొత్త సినిమాలు చేయకపోవచ్చు. కొంత బ్రేక్ తీసుకుని నయనతార లాగా మళ్ళీ కంబ్యాక్ అయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. మా ఇంటి బంగారం జోరు చూస్తుంటే వంద కాదు కానీ ఓ డెబ్భై ఎనభై కోట్ల దాకా చేరే ఛాన్స్ ఉంది. ఈ వారం ఎలాగూ కొత్త రిలీజులు లేవు కాబట్టి సెకండ్ వీకెండ్ ఖచ్చితంగా సమంతకు అనుకూలంగా మారుతుంది. చూస్తుంటే హీరోయిన్ బేస్డ్ మూవీస్ లో కొత్త రికార్డు సృష్టించడంలో డౌట్ పడనక్కర్లేదు.
This post was last modified on June 23, 2026 8:16 pm
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…