Political News

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు. ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి కీలక సమయాన ముద్రగడ కుమార్తె, జనసేన మహిళా నేత బర్లపూడి క్రాంతి సంచలన ఆరోపణలు గుప్పించారు. జగన్ కోసం తన తండ్రి తన పేరును సైతం మార్చుకుంటే… జగన్ మాత్రం తన తండ్రి పట్ల కనీస బాధ్యత కూడా చూపడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా క్రాంతి జగన్ తీరుపై నిప్పులు చెరుగుతూ ఓ సంచలన పోస్ట్ పెట్టారు. వైసీపీని ఆమె గూండాలు, రౌడీలు, గంజాయ్ బ్యాచ్ తో పోల్చారు. వైసీపీలోని రౌడీలు, గంజాయి బ్యాచ్ కు ఇస్తున్న విలువను కూడా తన తండ్రి పట్ల జగన్ చూపడం లేదని ఆమె విరుచుకుపడ్డారు. జగన్ కోసం తన తండ్రి ఏకంగా పేరునే మార్చుకున్న వైనాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించడం గమనార్హం. జగన్ కోసం తన తండ్రి అంత త్యాగం చేస్తే… చావు బతుకుల మధ్యలో ఉన్న తన తండ్రిని పరామర్శించే తీరిక కూడా జగన్ కు లేకపోయిందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతటితో ఆగని క్రాంతి… జగన్ తీరును విమర్శిస్తూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవసరం ఉన్నంతవరకే జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు గుర్తుంటారని ఆమె విమర్శించారు. అవసరం తీరాక వారందరినీ జగన్ మరచిపోతారని కూడా ఆమె ఆరోపించారు. గతంలో వైసీపీ కోసం సర్వం త్యాగం చేసిన తన తండ్రిని జగన్ ఇప్పుడు మరిచిపోయారని, జగన్ తీరే అంత అని ఆమె దెప్పి పొడిచారు. జగన్ తీరే ఇలా ఉంటే…ఇక వైసీపీ నేతల తీరు అంతకంటే మెరుగ్గా ఉంటుందని ఎలా అనుకొంటామని కూడా ఆమె సుతిమెత్తగానే సెటైర్లు సంధించారు. మొత్తంగా సింగిల్ పోస్ట్ తో ఆమె జగన్ అండ్ కోకు ఓ రేంజిలో ఇచ్చి పడేశారన్న వాదన వినిపిస్తోంది.

This post was last modified on June 23, 2026 2:43 pm

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

45 minutes ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

1 hour ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

3 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

3 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

3 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

3 hours ago