Political News

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు. ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి కీలక సమయాన ముద్రగడ కుమార్తె, జనసేన మహిళా నేత బర్లపూడి క్రాంతి సంచలన ఆరోపణలు గుప్పించారు. జగన్ కోసం తన తండ్రి తన పేరును సైతం మార్చుకుంటే… జగన్ మాత్రం తన తండ్రి పట్ల కనీస బాధ్యత కూడా చూపడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా క్రాంతి జగన్ తీరుపై నిప్పులు చెరుగుతూ ఓ సంచలన పోస్ట్ పెట్టారు. వైసీపీని ఆమె గూండాలు, రౌడీలు, గంజాయ్ బ్యాచ్ తో పోల్చారు. వైసీపీలోని రౌడీలు, గంజాయి బ్యాచ్ కు ఇస్తున్న విలువను కూడా తన తండ్రి పట్ల జగన్ చూపడం లేదని ఆమె విరుచుకుపడ్డారు. జగన్ కోసం తన తండ్రి ఏకంగా పేరునే మార్చుకున్న వైనాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించడం గమనార్హం. జగన్ కోసం తన తండ్రి అంత త్యాగం చేస్తే… చావు బతుకుల మధ్యలో ఉన్న తన తండ్రిని పరామర్శించే తీరిక కూడా జగన్ కు లేకపోయిందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతటితో ఆగని క్రాంతి… జగన్ తీరును విమర్శిస్తూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవసరం ఉన్నంతవరకే జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు గుర్తుంటారని ఆమె విమర్శించారు. అవసరం తీరాక వారందరినీ జగన్ మరచిపోతారని కూడా ఆమె ఆరోపించారు. గతంలో వైసీపీ కోసం సర్వం త్యాగం చేసిన తన తండ్రిని జగన్ ఇప్పుడు మరిచిపోయారని, జగన్ తీరే అంత అని ఆమె దెప్పి పొడిచారు. జగన్ తీరే ఇలా ఉంటే…ఇక వైసీపీ నేతల తీరు అంతకంటే మెరుగ్గా ఉంటుందని ఎలా అనుకొంటామని కూడా ఆమె సుతిమెత్తగానే సెటైర్లు సంధించారు. మొత్తంగా సింగిల్ పోస్ట్ తో ఆమె జగన్ అండ్ కోకు ఓ రేంజిలో ఇచ్చి పడేశారన్న వాదన వినిపిస్తోంది.

Kumar

Recent Posts

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

46 minutes ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

51 minutes ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

3 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

3 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

3 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

5 hours ago