విజయ్, త్రిషల బంధం గురించి గత కొన్ని నెలల్లో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. గతంలోనూ వీళ్లిద్దరూ సన్నిహితంగా కనిపించేవారు కానీ.. వారిది కేవలం సినిమా స్నేహమే అని.. ఇద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అనుకునేవారు. కానీ తన భార్య సంగీత నుంచి విజయ్ విడాకులకు సిద్ధమైన సమయంలో విజయ్కి త్రిష అత్యంత సన్నిహితంగా మెలగడం.. ఎన్నికల ముంగిట ఈ ఇద్దరూ జంటగా ఒక పెళ్లికి కూడా హాజరు కావడంతో ఇది మామూలు రిలేషన్ కాదని అర్థమైంది.
సంగీత నుంచి విడాకులు తీసుకుని, త్రిషను విజయ్ పెళ్లి చేసుకుంటాడని కూడా ప్రచారం జరిగింది. కానీ విజయ్ ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజుల తర్వాత వేగంగా పరిస్థితులు మారిపోయాయి. విజయ్కి, త్రిషకు మధ్య దూరం పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి. తన భార్య సంగీతతో విజయ్ మళ్లీ కలవబోతున్నట్లుగా ఇటీవల జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దే సమయంలో ఆయన్నుంచి త్రిష నుంచి దూరం జరుగుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ ప్రతి పుట్టిన రోజుకూ ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్ చేసి స్పెషల్ విషెస్ చెప్పడం త్రిషకు అలవాటు. కానీ నిన్న విజయ్ 52వ పుట్టిన రోజు సందర్భంగా మాత్రం త్రిష ఎలాంటి పోస్టు పెట్టలేదు. పైగా విజయ్ని ఆమె ఇన్స్టాగ్రామ్లో అన్ ఫాలో చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి అనుకోకుండా జరిగిన పరిణామాలా లేక.. నిజంగానే త్రిషకు, విజయ్కి మధ్య దూరం పెరిగిందా అన్న చర్చ జరుగుతోంది
రాజకీయాల్లోకి రావాలని త్రిష ఎంతో ఆశపడిందని, విజయ్ గెలిచి ఖాళీ చేసిన రెండో స్థానం తిరుచిరాపల్లి నుంచి ఆమె పోటీ చేయాలనుకుంటోందని ఇంతకుముందు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సీటును త్రిషకు ఇవ్వట్లేదని స్పష్టమైంది. దీనికి తోడు సంగీతతో విజయ్ మళ్లీ కలిసిపోనున్నట్లు కూడా వార్తలు రావడంతో.. ఈ పరిణామాలను జీర్ణించుకోలేక త్రిష విజయ్కి దూరమైందేమో అన్న చర్చ జరుగుతోంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…