టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు అతనే. రాజమౌళి భారీ బడ్జెట్లో, మూణ్నాలుగేళ్లకు ఒక సినిమా తీసి బాక్సాఫీస్ను షేక్ చేస్తే.. అనిల్.. ఏడాదికో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ వసూళ్ల మోత మోగిస్తున్నాడు. తన సినిమాలు సెట్స్ మీదికి వెళ్లక ముందు నుంచే అనిల్ వాటిని ప్రమోట్ చేసే తీరు కూడా భలేగా ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఈసారి విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ల కలయికలో తెరకెక్కనున్న చిత్రాన్ని కూడా అలాగే వార్తల్లో నిలబెడుతున్నాడు. ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ పేరుతో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ను వైజాగ్ బీచ్లో పూడ్చి పెట్టి జంధ్యాల సినిమాలో కామెడీ సీన్ గుర్తు చేసిన అనిల్.. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానున్న నేపథ్యంలో తనదైన శైలిలో వినోదాన్ని పంచాడు.
తాను ప్రమోషన్లు భలేగా చేస్తానంటూ అభిమానులు తనకిచ్చిన కత్తిని పట్టుకుని అనిల్ వీరావేశంతో వస్తే.. వెంకీ ఆ కత్తినే ఉపయోగించి అనిల్ వేలు కోసి (ఎడిట్ మాత్రమే) అతడికి రక్త తిలకం దిద్దడం.. కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా అందుకుని అదే పని చేయడం.. ఇలా భలే ఫన్నీగా సాగింది ఈ వీడియో. అంతా అయ్యాక ఈ సినిమా బ్యాక్డ్రాప్ ఏంటో రివీల్ చేశారు.
రాయలసీమ నేపథ్యంలో అనిల్ తన కొత్త చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. అందుకే ఇలా కత్తి.. వీర తిలకం అంటూ ఫన్నీ వీడియో చూసి రాయలసీమ ప్రాంతాన్ని గుర్తు చేసింది టీం. కాకపోతే అనిల్ సినిమాల్లో వయొలెన్స్కు పెద్దగా స్కోప్ ఉండదు.
వయొలెన్స్ చూపించినా.. అది కామెడీ కోణంలోనే ఉంటుంది. అనిల్ కూడా రాయలసీమ నేపథ్యం అయినా సరే.. తమది ఫక్తు ఫ్యామిలీ సినిమానే అని సంకేతాలు ఇచ్చాడు. ఐతే ఇప్పటిదాకా రాయలసీమ నేపథ్యంలో సినిమా తీయని అనిల్.. అక్కడి భాష, యాస, పరిస్థితులను తన కామెడీ-ఫ్యామిలీ సినిమాలో ఎలా ప్రెజెంట్ చేస్తాడన్నది ఆసక్తికరం.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…